China vs US: నాటికి నేటికీ ఎంత మార్పు..? అమెరికాను బెదిరించిన చైనా..!
బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి.. అంటే ఇదేనేమో. ట్రంప్ హయాంలో నేరుగా చైనాను బెదిరించగలిగిన అమెరికా పరిస్థితి.. జో బైడెన్ సమయం వచ్చే సరికి తారుమారైంది.
* ఒకప్పుడు షీజిన్పింగ్ను ముఖం మీదే బెదిరించిన ట్రంప్..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి.. అంటే ఇదేనేమో. ట్రంప్ హయాంలో నేరుగా చైనాను బెదిరించగలిగిన అమెరికా పరిస్థితి.. జో బైడెన్ సమయం వచ్చే సరికి తారుమారైంది. నేడు అమెరికా-చైనా అధినేతల వర్చువల్ చర్చలను షీజిన్పింగ్ బలప్రదర్శనకు బాగా వాడుకొన్నారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికన్లు ప్రోత్సహించడమంటే నిప్పుతో చెలగాటమాడుకొన్నట్లే అని ఏకంగా బైడెన్ను నేరుగా హెచ్చరించారు.
జోబైడెన్ ఆఫీస్లోకి వచ్చాక షీజిన్పింగ్తో వర్చువల్గా జరిగిన కీలక భేటీ ఇదే. తొలుత ఇద్దరు వ్యక్తిగత సంబంధాలను గుర్తు తెచ్చుకొన్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన వివాదాన్ని ప్రస్తావనకు తెచ్చినట్లు చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సమావేశం సందర్భంగా షీ జిన్పింగ్ మాట్లాడుతూ ‘‘తైవాన్ కోసం అక్కడి అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం’’ అని పేర్కొన్నట్లు చైనా మీడియా పేర్కొంది.
బైడెన్ మాత్రం జిన్పింగ్ ఆరోపణలను వ్యతిరేకించారు. తాము యథాతథ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడాన్నివ్యతిరేకిస్తామని తెలిపారు. ఒక్క తైవాన్ అంశంలో తప్ప మిగిలిన విషయాల్లో భేటీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది. ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ ఆంకాంక్షించారు.
గతంలో ట్రంప్ దెబ్బకు బెదిరిపోయిన జిన్పింగ్..!
2017 ఏప్రిల్ నెలలో చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ అమెరికాలో పర్యటించారు. నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫ్లొరిడాలోని పామ్ బీచ్లో ఓ విలాసవంతమైన విడిది ఉంది. జిన్పింగ్కు అక్కడ ఆతిథ్యం ఇచ్చారు.
అదే సమయంలో మరోపక్క సిరియాలోని బషర్ అల్ అసద్ సేనలకు వ్యతిరేకంగా అమెరికా సంకీర్ణ సేనలు పోరాడుతున్నాయి. రష్యా ప్రోత్సాహంతో చైనా నుంచి బషర్ సర్కారుకు సాయం అందుతోందన్న అనుమానాలు అమెరికాలో ఉన్నాయి. బషర్ అల్ అసద్పై తీసుకొస్తున్న ఐరాస తీర్మానాలను తరచూ రష్యాతో కలిసి చైనా అడ్డుకుంటోంది. దీనికి తోడు అసద్ విషవాయువులను సిరియాలోని సొంత ప్రజలపై ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో జిన్పింగ్ను హెచ్చరించడానికి డిన్నర్ను వాడుకొన్నారు.
ఆ సమయంలో ఏం జరిగింది..?
ట్రంప్, జిన్పింగ్ భోజనం ముగించి చాక్లెట్ కేక్ తింటున్నారు. అదే సమయంలో ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటలకు జిన్పింగ్ అవాక్కయ్యారు. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్ మీకో విషయం చెబుతాను. ఇప్పుడే మేము 59 క్షిపణులను ప్రయోగించాం. అవి ఇరాక్ వైపు(పొరబాటున వచ్చిన మాట).. ఇప్పుడే సిరియావైపు వెళుతున్నాయి. మీకు ఆ విషయం తెలియాలి అనుకొంటున్నాను’’ అని అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు 10 క్షణాలపాటు ఏమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న దుబాసీని పిలిచి ట్రంప్ ఏమన్నారో మరోసారి చెప్పమని కోరారు. అనంతరం దుబాసీ చెప్పింది విన్నారు.
అనంతరం జిన్పింగ్ స్పందిస్తూ.. ‘‘ మీరు చెప్పినట్లు గానీ, ఇంకా ఏ విధంగానైనాగానీ ఎవరైన విషవాయువులను చిన్నపిల్లలు, పసికందులపై ప్రయోగించడం రాక్షసత్వం. ఇట్స్ ఓకే’’ అని జిన్పింగ్ స్పందించారు. డిన్నర్ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడాన్ని చైనీయులు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. మార్-ఎ-లాగో డిన్నర్ షీజిన్పింగ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కూడా ట్రంప్ తన పదవీకాలం చివరి వరకు చైనాను ఇరుకునపెడుతూనే వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం