Xi Jinping: చైనాకు జీవితకాల ‘కింగ్’.. జిన్పింగ్
యావత్ ప్రపంచం అనుకున్నదే జరిగింది. చైనాకు జీవితకాల అధినాయకుడిగా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను నియమించేందుకు వీలుగా చారిత్రక తీర్మానానికి అక్కడి
చరిత్రాత్మక తీర్మానానికి కమ్యూనిస్టు పార్టీ ఆమోదం
బీజింగ్: యావత్ ప్రపంచం అనుకున్నదే జరిగింది. చైనాకు జీవితకాల అధినాయకుడిగా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను నియమించేందుకు వీలుగా చారిత్రక తీర్మానానికి అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదముద్ర వేసింది. ఈ తీర్మానంతో వచ్చే ఏడాది జిన్పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చరిత్రాత్మక తీర్మానం కావడం విశేషం.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పొలిట్ బ్యూరో 19వ సెంట్రల్ కమిటీ ఆరో ప్లీనరీ సమావేశం నవంబరు 8న ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఈ కీలక తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ శుక్రవారం వెల్లడించనుంది.
సాధారణంగా చైనా కమ్యూనిస్టు పార్టీలోని పొలిట్ బ్యూరోలో రిటైర్మెంట్ వయస్సు 68 ఏళ్లు. ప్రస్తుతం జిన్పింగ్ ఆ వయస్సుకు చేరుకున్నారు. అంతేగాక, వచ్చే ఏడాదికి ఆయన పదవీకాలం రెండు పర్యాయాలు ముగుస్తుంది. ఉన్నత నాయకులెవరూ రెండు సార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, 68 ఏళ్లు నిండిన తరవాత రిటైరైపోవలసిందేనని కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్ తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ జియవోపింగ్ నిర్దేశించారు. అయితే ఈ నిబంధనను మారుస్తూ మూడేళ్ల క్రితం జిన్పింగ్ సర్కారు రాజ్యాంగంలో కీలక సవరణ చేసింది. దీంతో రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది. ఈ నేపథ్యంలో జిన్పింగ్ మూడో సారి పగ్గాలు చేపట్టేందుకు ఆ సవరణ మార్గం కల్పించింది. ఇక ఇప్పుడు ప్లీనరీ ఆమోదించిన తాజా చారిత్రక తీర్మానంతో చైనాపై జిన్పింగ్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు అవకాశం లభించినట్లయింది.
2022 రెండో అర్ధభాగంలో సీపీసీ 20వ జాతీయ కాంగ్రెస్ను నిర్వహించాలని ప్లీనరీ నిర్ణయించింది. ఆ సమావేశాల్లోనే మూడోసారి జిన్పింగ్కు అధికారికంగా మూడోసారి దేశ పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది. జిన్పింగ్ చైనాలోని మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల అధిష్ఠానమైన కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్గా, దేశాధ్యక్షుడిగా తనే చక్రం తిప్పుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా గుర్తింపు సాధించారు.
మూడో చారిత్రక తీర్మానం..
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తన వందేళ్ల చరిత్రలో చేసిన మూడో చరిత్రాత్మక తీర్మానం ఇది. 1945లో మావో అధికారాలు బలోపేతం చేసేందుకు, 1981లో డెంగ్ జియావో పింగ్ సమయంలో ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచేందుకు సీపీసీ చారిత్రక తీర్మానాలను ఆమోదించింది. తాజా తీర్మానంతో మావో, డెంగ్లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా షీ జిన్పింగ్కు ప్రాముఖ్యం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.