
China: ఏనుగులు తమ ఇంటికి చేరుకున్నాయి..
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో సంచరిస్తున్న ఏనుగులు ఎట్టకేలకు తమ ఆవాసానికి చేరుకున్నాయి. కొన్ని నెలల పాటు ప్రయాణం చేసిన సంచార ఏనుగులు చైనా నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్కు చేరుకున్నాయి. గత ఐదు రోజులుగా ఏనుగుల మంద యుగ్జీ నగరం సమీపంలో సంచరించింది. స్థానిక అధికారులు డ్రోన్ల సాయంతో వాటి కదలికలను పర్యవేక్షించారు. గురువారం యుగ్జీ నగరం నుంచి ఏనుగుల మంద అడవుల్లోకి తమ ప్రయాణం కొనసాగించింది. శరత్కాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి అవి తిరుగు ముఖం పడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది ఏనుగుల గుంపు జిషింగ్బన్న దాయ్ ప్రాంతంలోని అడవుల నుంచి 500 కి.మీ మేర ప్రయాణించి జూన్ 2న కున్మేందుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అవి రద్దీ జనావాసాల్లోకి రాకుండా చైనా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గతేడాది యువాన్ ఫ్రావిన్స్లోని రిజర్వ్ నుంచి బయటకువచ్చిన 16 అడవి ఏనుగులు 500 కిలోమీటర్లు పయనించాయి. మొత్తంగా 16 గజరాజులు రిజర్వ్ నుంచి బయటకు రాగా.. వాటిలో రెండు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.