Indian Air Force: చైనా యుద్ధ విమానాలు మోహరించే ఉన్నాయి
లద్ధాఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు అవతలి వైపు మూడు స్థావరాల్లో చైనా ఎయిర్ ఫోర్స్ దళాలు ఇంకా మొహరించి ఉన్నాయని భారత వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి వెల్లడించారు. మరోవైపు ఐఏఎఫ్ కూడ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఇటీవల భారత...
ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి
దిల్లీ: తూర్పు లద్ధాఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు అవతలి వైపు మూడు స్థావరాల్లో చైనా ఎయిర్ ఫోర్స్ దళాలు ఇంకా మోహరించి ఉన్నాయని భారత వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వెల్లడించారు. మరోవైపు ఐఏఎఫ్ కూడా అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఇటీవల భారత వాయుసేనలో రఫేల్, అపాచీలను ప్రవేశపెట్టడంతో పోరాట సామర్థ్యం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఐఏఎఫ్ 89వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. లద్ధాఖ్ సమీపంలో చైనా వాయుసేన కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యం బలహీనమేనన్నారు. చైనా, పాకిస్థాన్ భాగస్వామ్యంపై కూడ భయపడాల్సిన అవసరం లేదని, కానీ.. పాకిస్థాన్ నుంచి చైనాకు పాశ్చాత్య సాంకేతికత ఎగుమతవుతుండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
‘త్రివిధ దళాల అనుసంధానంతో మెరుగైన ఫలితాలు’
ఐఏఎఫ్పై సైబర్ దాడుల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. త్రివిధ దళాల అనుసంధానంపై ఐఏఎఫ్ సానుకూలంగా ఉందని చెప్పారు. ఈ మూడింటి ఉమ్మడి ప్రణాళిక, వాటి అమలుతో పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. చౌదరి ఇటీవలే ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా నుంచి ‘చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్’గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిదే. ఇదిలా ఉండగా.. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా తన బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలూ మెరుగుపర్చుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణె సైతం ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె