డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవి (ప్లాన్) జలాంతర్గాముల కోసం తరచూ భారత్ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది
రహస్యంగా చైనా నౌక సంచారం..!
ఇండోనేషియాలో దొరికిపోయి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవి (ప్లాన్)కి చెందిన జలాంతర్గాముల కోసం తరచూ భారత్ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక సమాచార వ్యవస్థలను ఆఫ్ చేసి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు బయటపెట్టారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న డ్రాగన్.. తన సబ్మెరైన్లకు అత్యంత కీలక సమాచారం అందజేసేందుకు ఈ నిఘా కార్యక్రమాలు చేపడుతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా జియాంగ్ యాంగ్ హాంగ్ 03 సర్వే నౌక వార్తల్లో నిలిచింది. గత రెండేళ్లలో ఈ నౌక పలు మార్లు ఇలాంటి పనులు చేసినట్లు తేలింది.
స్మగ్లర్ల స్టైల్లో..
జియాంగ్ యాంగ్ హాంగ్ 03 నౌక జనవరి 6వ తేదీన హైనాన్ ద్వీపం నుంచి బయల్దేరింది. దీనిని జనవరి 11వ తేదీన ఇండోనేషియా కోస్టుగార్డు దళం సిబ్బంది అడ్డుకొన్నారు. అత్యంత కీలకమైన సుండా జలసంధి వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ జలసంధి నుంచి నౌకలు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా ఏఐఎస్ వ్యవస్థ ఆన్లో ఉండాలి. గాల్లోకి ఎగిరిన విమానాలు ఎక్కడున్నాయో తెలుసుకొనేందుకు ట్రాన్స్పాండర్లు ఎలా ఉపయోగపడతాయో.. అలానే సముద్ర జలాల్లో సంచరించే నౌకలకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఐఎస్) పనిచేస్తుంది. నౌకల సంచారాన్ని ఉపగ్రహాలు పసిగట్టేందుకు ఉపయోగపడతాయి. దీంతో ఉపగ్రహాలు వాటికి సముద్ర మార్గాలను తెలియజేస్తాయి.. అంతేకాదు ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడకుండా చూస్తాయి. ఇండోనేషియా ద్వీప సమూహం కావడంతో ఏ నౌక ఏ ద్వీపం వద్ద నుంచి వెళ్తుందో అక్కడి కోస్టుగార్డ్లు తెలుసుకోవడానికి ఇది కీలకం. ఉత్తరకొరియా వంటి దేశాల నౌకలు స్మగ్లింగ్కు పాల్పడేందుకు వీటిని సముద్రం మధ్యలో ఆపేస్తాయి.
జియాంగ్ యాంగ్ హాంగ్ 03 సిబ్బంది దీనిని ఆన్లో ఉంచలేదు. ఈ వ్యవస్థ దెబ్బతిందని చెబుతున్నారు. కానీ, ది మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ కథనం ప్రకారం మాత్రం నటూనా ద్వీపాల వద్ద నుంచి వెళ్లేటప్పుడు రెండు సార్లు ఏఐఎస్ వ్యవస్థను ఆపేశారని తేలింది. నటూనా ద్వీపం వద్ద సముద్రజలాలపై హక్కు విషయంలో చైనాతో ఇండోనేషియాకు వివాదం కొనసాగుతోంది. ఇటీవలే ఇండోనేషియా సముద్ర జలాల్లో చైనా అండర్వాటర్ డ్రోన్లు కీలక సమాచారం సేకరిస్తూ దొరికాయి. ఆ తర్వాత వెంటనే ఈఘటన చోటు చేసుకొంది.
జలాంతర్గాముల కోసం సమాచారం..
తాజాగా జియాంగ్ యాంగ్ హాంగ్ 03 సర్వే నౌక కూడా సుండా జలసంధి, లొంబాక్ జలసంధి, మలక్కా జలసంధి వద్ద సమాచార సేకరణ చేస్తోంది. ఈ మూడు మార్గాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చేందుకు అత్యంత కీలకమైనవి. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం కార్యకలాపాలు చేపట్టాలంటే అవసరమైన సురక్షిత మార్గాలకోసం ఇది గాలిస్తోంది. ఈ నౌక పలు మార్లు ఈ మార్గాల్లో సర్వేచేసింది. 2019లో సుండా జలసంధి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చి సముద్రం అడుగున సర్వే చేసింది. బంగాళాఖాతంలోకి కూడా వచ్చి సమాచారం సేకరించింది. ఆ మార్గాలన్నీ భారత్, ఆస్ట్రేలియా జలాంతర్గాముల కార్యకలాపాలకు అత్యంత కీలకమైనవి. 2019లో షియాన్ -1 అనే నౌక పోర్టుబ్లేయర్ వద్ద సమచారం సేకరిస్తుండటంతో నౌకాదళం హెచ్చరించి పంపిందని నేవీచీఫ్ అడ్మిరల్ కబీర్ గతంలో వెల్లడించారు. తాజాగా జియాంగ్ యాంగ్ హాంగ్ 03 కార్యకలాపాలు కూడా జలాంతర్గాముల కోసమే అని భావిస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విశ్లేషకుడు మాల్కం డేవిస్ స్పందించారు. ‘చైనా ఇండోనేషియా జలాల్లోకి వచ్చిందంటే ఒక కన్నేసి ఉంచాల్సిందే. వారు ఎందుకు వచ్చారు.. ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం అత్యంత కీలకం’ అని పేర్కొన్నారు.
2030 నాటికి ఆసియాలో చైనా జలాంతర్గాములదే హవా..
2030 నాటికి చైనా ఆసియాలో అతిపెద్ద జలశక్తిగా మారే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణుడు హెచ్ఐ సట్టన్ 2020లో ఫోర్బ్స్కు రాసిన కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వివిధ దేశాలకు చెందిన 239 సబ్మెరైన్లు నిశ్శబ్దంగా సముద్ర జలాల్లో ఉన్నాయి. 2030 నాటికి ఈ ప్రాంతంలో మరో 220 కొత్తగా వచ్చే అవకాశం ఉంది. చైనా వద్ద ఏకంగా 79 వరకు ఉండవచ్చని అంచనా. ప్రపంచంలోనే అత్యధిక సబ్మెరైన్లు ఉన్న దేశంగా చైనా నిలిచే అవకాశం ఉందని సట్టన్ తెలిపారు. భారత్కు కూడా అప్పటికి దాదాపు 21 సబ్మెరైన్లు ఉండవచ్చని అంచనావేశారు. దీనికంటే చైనా బలగం దాదాపు రెండురెట్లకు పైగా ఉండనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం చైనా నేవీ చుట్టుపక్కల సముద్ర జలాల్లో సమాచారాన్ని ముందుగానే సేకరిస్తోంది.
ఇవీ చదవండి
లద్దాఖ్లో గడ్డకట్టిన ఉత్కంఠ..!
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు