విశాఖ వెళ్తాం..‘ఉక్కు’కోసం పోరాడతాం: తపన్సేన్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం ప్రజలు పోరాడుతుంటే.. వేర్వేరు మార్గాల్లో పూర్తిగా ......
దిల్లీ: విశాఖ ఉక్కు ఉద్యమానికి పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. వైజాగ్ స్టీల్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వ కారణమని నేతలు అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విమర్శించారు. విశాఖ ఉక్కు కోసం ప్రజలు పోరాడుతుంటే.. వేర్వేరు మార్గాల్లో పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతలు కలిసి ఆంధ్రాభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తపన్ సేన్ మాట్లాడుతూ.. గతంలో కూడా ప్రైవేటీకరించేందుకు చూస్తే పోరాడి అడ్డుకున్నామన్నారు. ఇప్పుడూ అదే పోరాటంతో ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు వైజాగ్కు వెళ్లి విశాఖ స్టీల్ పరిరక్షణకు పోరాడతామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా చేసి విలువైన ప్రజల ఆస్తులను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇంతవరకు ప్రత్యేక గనులు కేటాయించలేదని, గనులు కేటాయించి లాభాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.
నష్టాల్ని బూచిగా చూపి కార్పొరేట్లకు ధారాదత్తమా?
విశాఖ ఉక్కు ఉద్యమంలో తాము భాగస్వాములవుతున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. విశాఖ ఉక్కు ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, ఆంధ్రులు పోరాడి సాధించుకున్నారని గుర్తు చేశారు. తాత్కాలికంగా వచ్చిన నష్టాలను బూచిగా చూపించి కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. ప్రత్యేక గనులు కేటాయించి ఉంటే నష్టాలు వచ్చివి కాదన్నారు. స్టీల్ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఏపీ సీఎం జగన్పై ఉందన్నారు. ఈ విషయంలో జగన్ అన్ని పక్షాలను కలుపుకొని ఎందుకు ముందుకెళ్లడంలేదని వెంకట్ ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చొరవతీసుకొని స్పందించాలని కోరారు. కేంద్రానికి భయపడి తెలుగు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతోమంది ప్రాణత్యాగాలతో వచ్చిందని ఏఐకేఎస్ సహాయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. రైతు సంఘాలు విశాఖ వెళ్లి తెలుగుప్రజలకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటామని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా