Supreme Court: మహమ్మారి బలవంతంగా మార్పు తీసుకొచ్చింది: సీజేఐ
నూతన విచారణ పద్ధతులు అవలంబించాల్సిందిగా కరోనా మహమ్మారి (Covid 19) భారత న్యాయవ్యవస్థను బలవంతం చేసిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justic DY Chandrachud) అన్నారు. ఎస్సీవో దేశాల ప్రధాన న్యాయమూర్తులు సమావేశంలో ఆయన మాట్లాడారు.
దిల్లీ: కొవిడ్ మహమ్మారి (Covid-19)తో భారత న్యాయవ్యవస్థలో నూతన పద్ధతులు అవలంబించాల్సి వచ్చిందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justic DY Chandrachud) అన్నారు. సరికొత్త విధానాల ద్వారా కేసుల విచారణ చేపట్టి న్యాయవ్యవస్థ పనితీరును మెరుగుపరిచామన్నారు. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్స్ (SCO) సభ్య దేశాల ప్రధాన న్యాయమూర్తుల 18వ సమావేశం దిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కాలంలో భారత న్యాయవ్యవస్థ తీసుకున్న కీలక నిర్ణయాలు, విచారణ విధానం గురించి మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో జిల్లా కోర్టులు 1.65 కోట్ల కేసులను విచారించగా.. హైకోర్టులు 75.8 లక్షల కేసులు, సుప్రీం కోర్టు 3,79,954 కేసులను విచారించినట్లు సీజేఐ వెల్లడించారు.
‘‘ఆధునిక విచారణ పద్ధతులను అవలంబించాల్సిందిగా కరోనా మహమ్మారి భారత న్యాయవ్యవస్థను బలవంతం చేసింది. క్రియాశీల నిర్ణయాలతో న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో మహమ్మారి కోసం వేచి చూడకుండా నూతన పద్ధతులను అవలంబించాం’’ అని సీజేఐ అన్నారు. మహమ్మారి వ్యాప్తి సమయంలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా చూడటంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు కీలక పాత్ర పోషించాయని అన్నారు. న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న దానిపై చర్చించడమే ప్రధాన అజెండాగా.. ఎస్సీఓ సభ్యదేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశాలు ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహించనున్నారు. ఎస్సీఓలో భారత్, చైనా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాలు ఎస్సీవో పరిశీలకులుగా వ్యవహరించగా.. అమెరికా, అజర్బైజాన్, కాంబోడియా, నేపాల్ కూడా ప్రత్యేక సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో పాకిస్థాన్ తరఫు ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ వ్యాప్తి సమయంలో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్న సీజేఐ.. లాక్డౌన్ మూలంగా రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కోర్టుల రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీంతో ఆన్లైన్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారించామని తెలిపారు. కొవిడ్ కాలంలో ఎదురైన ఎన్నో సమస్యలను సుమోటోగా తీసుకొని విచారించామని సీజేఐ గుర్తు చేశారు. వలస కూలీల విషయంలో కోర్టులు తీసుకున్న నిర్ణయాలు, ప్రత్యేక జైళ్ల ఏర్పాటు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వాలని ఆదేశించడం లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతగానో తోడ్పడ్డాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ