Glasgow Climate Pact: భారత్ మాటకు విలువిచ్చిన ‘గ్లాస్గో’
భూతాపానికి అడ్డుకట్ట వేసి మానవాళిని రక్షించుకోవడమే లక్ష్యంగా సాగిన ఐరాస వాతావరణ సదస్సు(కాప్26) ఎట్టకేలకు ఓ నిర్మాణాత్మక ఒప్పందంతో ముగిసింది....
నిర్మాణాత్మక ఒప్పందంతో ముగిసిన ‘కాప్26’
గ్లాస్గో: భూతాపానికి అడ్డుకట్ట వేసి మానవాళిని రక్షించుకోవడమే లక్ష్యంగా సాగిన ఐరాస వాతావరణ సదస్సు(కాప్26) ఎట్టకేలకు ఓ నిర్మాణాత్మక ఒప్పందంతో ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపు 200 దేశాలు కొత్త వాతావరణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ‘శిలాజ ఇంధనాల నిర్మూలన’ ప్రతిపాదనపై భారత్ చేసిన నిర్మాణాత్మక సూచనలు అంగీకరిస్తూ.. ఒప్పందాన్ని ‘శిలాజ ఇంధనాల దశలవారీ తగ్గింపు’నకు పరిమితం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రీన్హౌస్ వాయువులతో హానికరమైన వాతావరణానికి కారణమవుతున్న బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు కుదిరిన ఐరాస తొలి వాతావరణ ఒప్పందం ఇదే కావడం విశేషం. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేసే లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా, తదుపరి కార్బన్ కోతలపై చర్చించడానికి వచ్చే ఏడాది సమావేశం కావాలని ఒప్పందంలో భాగంగా దేశాలు అంగీకరించాయి. భూగ్రహం, ప్రజల శ్రేయస్సు కోసం చేసిన కీలక ఒప్పందంతో ముగిసిన ఈ సమావేశ స్ఫూర్తిని నిలిపి ఉంచుతారని ఆశిస్తున్నట్లు కాప్26 అధ్యక్షుడు ఆలోక్ శర్మ అన్నారు.
అయితే, భారత్ ప్రతిపాదించిన మార్పులపై పలు దేశాలు పెదవి విరిచాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు.. వారి వృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన వంటి అజెండాల అమలులో కీలక దశలో ఉన్న సమయంలో ‘శిలాజ ఇంధనాల నిర్మూలన’ తీర్మానం సహేతుకం కాదని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గ్లాస్గో సమావేశానికి వివరించారు. తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. పారిస్ వాతావరణ సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మనసా, వాచా, కర్మనా ఆచరించాలని నొక్కి చెప్పారు.
అయితే, శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు సంపదతో సుభిక్షంగా విలసిల్లుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి దేశం నెట్జీరో (కర్బన ఉద్గార తటస్థత) సాధనా లక్ష్యాలను ఆయా ప్రాంతాల పరిస్థితులు, బలాలు, బలహీనతలను అనుసరించి సాధిస్తాయని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల బాధ్యతాయుత వినియోగం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కని పునరుద్ఘాటించారు. ఉదాహరణకు భారత్లో రాయితీ ధరతో ఇస్తున్న ఎల్పీజీ గురించి ప్రస్తావించారు. దీని వల్ల పేద కుటుంబాల్లో కాలుష్యం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధన వినియోగ నిర్మూలన గురించి సదరు దేశాల హామీని కోరడం దుర్విచక్షణే అవుతుందని స్పష్టం చేశారు.
నిజానికి గ్లాస్గో సమావేశం శుక్రవారమే ముగియాల్సి ఉంది. కానీ, ముసాయిదా ఒప్పందంలోని ‘శిలాజ ఇంధన నిర్మూలన’ ప్రతిపాదనపై భారత్ సవరణలు సూచించడంతో ఒప్పందంపై ఆరోజు ఎలాంటి ఫలితం తేలలేదు. దీంతో శనివారానికి సమావేశాన్ని పొడిగించి చివరకు భారత్ సహా మరికొన్ని దేశాలు చేసిన విజ్ఞప్తులను స్వీకరించి ఓ ఆమోదయోగ్య ఒప్పందానికి రూపకల్పన చేశారు. అయితే, కొన్ని దేశాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించిన భారత సంతతి బ్రిటీష్ మంత్రి ఆలోక్ శర్మ సభ్య దేశాలకు క్షమాపణలు చెబుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
నాగాలాండ్లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు.