Eknath Shinde: కొత్త సీఎంకు అసెంబ్లీలో బలపరీక్ష.. సోమవారానికి గడువు..!
ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో దాదాపు పదిరోజుల పాటు కొనసాగిన అనిశ్చితి.. అసమ్మతి నేత ఏక్నాథ్ శిందే(Eknath Shinde) గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. ఇక ఆయన తన ప్రభుత్వానికి ఉన్న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకు గవర్నర్ సోమవారం వరకు గడువు విధించారు. ఆ నిమిత్తం మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సమావేశంలో స్పీకర్ను ఎన్నుకొని, తర్వాత ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక, శివసేనకున్న 55 మంది ఎమ్మెల్యేలలో 39 మంది తన వర్గంలో ఉన్నారని శిందే వెల్లడించారు. భాజపాకు 106 ఎమ్మెల్యేలున్నారు. కొత్త ప్రభుత్వానికి కమల దళం మద్దతు ఉండనుంది. మొత్తంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు నిన్న శిందే గవర్నర్కు వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం స్థానాలు 288.
ట్విటర్ బయోలో మార్పు
మరోపక్క అనూహ్యంగా సీఎం అయిన ఆయన.. ఇక తమదే అసలైన శివసేన అని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తానే బాల్ఠాక్రే(సేన వ్యవస్థాకుడు) రాజకీయ వారసుడిననే సందేశాన్ని ప్రజల్లోకి పంపడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా మొదట తన ట్విటర్ బయోలో మార్పు చేశారు. అందులో శిందే.. బాల్ ఠాక్రే వద్ద కూర్చొని కనిపించారు. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేసేలా ఉందా చిత్రం. తమదే అసలైన సేన అనే వాదనను సుప్రీకోర్టులో కూడా వినిపించారు. అసహజసిద్ధ కూటమితో పొత్తు పెట్టుకొని ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి బాల్ ఠాక్రే భావజాలాన్ని పక్కనపెట్టారని శిందే వర్గం వాదిస్తోంది.
గోవా హోటల్లో శిందేకు ఘన స్వాగతం..
మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శిందే తిరిగి గోవా హోటల్కు చేరుకున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలు శిందేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్ఠాక్రే, ఆనంద్ దిఘేకు అనుకూలంగా నినాదాలు చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా హోటల్కు చేరుకొని కొత్త సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి ముందు ఏక్నాథ్ శిందేకు ముఖ్యమంత్రి పదవి వరించిందని తెలియడంతో.. హోటల్లోని ఎమ్మెల్యేలంతా సంబురాలు చేసుకున్నారు. మరాఠీ పాటలకు డ్యాన్సులు వేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
India News
Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Washington Sundar: వాషింగ్టన్ సుందర్కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!