Cm Kcr: దేశంలో ఒక సంచలనం జరగాలి.. జరిగి తీరుతుంది: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

Updated : 21 May 2022 19:24 IST

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు. దిల్లీలోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అఖిలేశ్‌ యాదవ్‌, కేజ్రీవాల్‌తో జరిపిన చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉంది. తొందర్లోనే జరిగి తీరుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని