Arvind Kejriwal: దిల్లీలో 80శాతం కట్టడాలు ఆక్రమణలే..: అరవింద్‌ కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ధ్వజమెత్తారు. దిల్లీలో 80శాతం కట్టడాలు ఆక్రమణలే అన్న ఆయన.. వాటన్నింటినీ

Published : 16 May 2022 14:39 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ధ్వజమెత్తారు. దిల్లీలో 80శాతం కట్టడాలు ఆక్రమణలే అన్న ఆయన.. వాటన్నింటినీ కూల్చేస్తే దేశంలోనే అతిపెద్ద విధ్వంసం ఇదే అవుతుందని భాజపాపై మండిపడ్డారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘దుకాణాలు, ఇళ్లను కూల్చివేసేందుకు వారు(భాజపా నేతృత్వంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లను ఉద్దేశిస్తూ) బుల్డోజర్లతో కాలనీలకు వస్తున్నారు. కనీసం ఎలాంటి పత్రాలు చెక్‌ చేయకుండా నిర్మాణాలను కూల్చేస్తున్నారు. దిల్లీని ఓ ప్రణాళిక ప్రకారం నిర్మించలేదు. ఇక్కడ 80 శాతానికి పైగా ఉన్న కట్టడాలు ఆక్రమణలే అని చెప్పొచ్చు.  దానర్థం 80శాతం దిల్లీని మీరు ధ్వంసం చేయబోతున్నారా? అక్రమ కట్టడాల కూల్చివేతల్లో మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలు సరికాదు. దాదాపు 50లక్షల మంది ప్రజలు అనధికారిక కాలనీల్లో, 10లక్షల మంది జుగ్గీల్లో నివాసముంటున్నారు. అంటే 60లక్షలకు పైగా ప్రజల ఇళ్లు, దుకాణాలను మీరు బుల్డోజర్లతో కూల్చేయనున్నారా? అదే జరిగితే స్వతంత్ర భారతంలో ఇదే అతి పెద్ద వినాశనం కానుంది’’ అని కేజ్రీవాల్‌ భాజపాపై మండిపడ్డారు.

భాజపా కక్షపూరితంగా చేస్తోన్న ఈ అక్రమ కట్టడాల కూల్చివేతను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడొద్దని చెప్పారు. రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ కచ్చితంగా విజయం సాధిస్తుందని, అప్పుడు ఈ ఆక్రమణల సమస్యను పరిష్కరిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. అనధికారిక కాలనీల్లో ఉంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని