Punjab: ఉచిత వైద్యం.. మరో 400 మొహల్లా క్లీనిక్లు ప్రారంభం
పంజాబ్ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యమందించేందుకు మరిన్ని క్లీనిక్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 100 క్లీనిక్లు ఉండగా.. తాజాగా మరో 400 మొహల్లా క్లీనిక్లను దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.
అమృత్సర్: దిల్లీ(Delhi) మోడల్ పాలన అందిస్తామంటూ పంజాబ్(Punjab)లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అదే దిశగా పనిచేస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఇప్పటికే 100 మొహల్లా క్లీనిక్(Mohalla clinics)లు ప్రారంభించగా.. తాజాగా మరో 400 క్లీనిక్లను ఆప్ చీఫ్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann ) రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేవలం 10 నెలల్లోనే 500 మొహల్లా క్లీనిక్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్ సింగ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తదితరులు పాల్గొన్నారు.
మేం విద్య, వైద్యం గురించే మాట్లాడతాం.. ద్వేషం గురించి కాదు!
ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. దిల్లీలోని మొహల్లా క్లీనిక్లను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సీఎం అక్కడ బస్తీ దావాఖానాలు పెట్టారన్నారు. తమిళనాడు సీఎం దిల్లీ తరహాలో అక్కడ పాఠశాలలు నిర్మిస్తున్నారన్నారు. తాము విద్య, వైద్యం, పరిశ్రమల గురించే మాట్లాడుతున్నామని.. ద్వేషం గురించి కాదన్నారు. ఈ క్లీనిక్లకు వచ్చే రోగుల సమస్యలకు సంబంధించిన రికార్డులను వారి మొబైల్ నంబర్తో అనుసంధానం చేసి రాష్ట్రంలోని ఏ క్లీనిక్లోనైనా వచ్చే విధంగా చేస్తున్నట్టు చెప్పారు. రోగుల రికార్డులను కంప్యూటరీకరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో పంజాబీలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నట్టు చెప్పారు. పంజాబ్ను బ్రిటిష్ వారి కన్నా రాజకీయ నేతలే దోపిడీ చేశారని మండిపడ్డారు. ఆ దోపిడీని తాము అడ్డుకుంటున్నామన్నారు.
దేశ రాజధాని దిల్లీ(Delhi) తరహాలోనే పంజాబ్(Punjab)లోనూ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఆప్ సర్కార్(AAP Government) చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను విదేశాల్లో శిక్షణకు పంపించాలని పంజాబ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఫిబ్రవరి 4న సింగపూర్కు తొలి విడతలో 36 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను పంపించబోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్