Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్ మోదీ మల్టీప్లెక్స్’.. జైరాం రమేశ్ విమర్శలకు భాజపా కౌంటర్
‘కొత్త పార్లమెంట్ మోదీ (PM Modi) మల్టీప్లెక్స్’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు భాజపా కౌంటర్ ఇచ్చింది.
దిల్లీ: నూతన పార్లమెంట్ (new parliament) మోదీ (PM Modi) మల్టీప్లెక్స్ (Multiplex) అని కాంగ్రెస్ (Congress) విమర్శించింది. నూతన భవనంలో చర్చలు కనుమరుగయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ట్విటర్ వేదికగా ఆరోపించారు. కొత్త పార్లమెంట్లో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు భాజపా (BJP) గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘‘నూతన పార్లమెంట్ మోదీ మల్టీప్లెక్స్ లేదా మారియట్. కొత్త భవనంలో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో చాలా విషయాలను గమనించా. ఈ భవనం ప్రధాని మోదీ లక్ష్యాలను చాలా బాగా అర్థం చేసుకోగలిగింది. చట్ట సభల్లో చర్చలు కనుమరుగైనట్లుగా అనిపిస్తోంది. పార్లమెంట్ ఆవరణలో కూడా ఇదే కొనసాగుతోంది. రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయకుండానే ప్రధాని విజయం సాధించారు’’ అని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన పాత పార్లమెంట్ను గుర్తు చేసుకున్నారు.
బలమైన ప్రభుత్వం వల్లే.. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై మోదీ
పాత పార్లమెంట్లో ప్రతి సభ్యుడితో చర్చలు జరిపే అవకాశం ఉండేదని అన్నారు. ప్రస్తుతం సభ్యులను చూసేందుకు బైనాక్యులర్ అవసరం ఉంటుందేమో అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవి సమావేశాలను చర్చలను బలహీనపరుస్తాయని ఆరోపించారు. గతంలో సెంట్రల్ హాల్, కారిడార్లలో నడిచేందుకు వీలు ఉండేదని.. ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. మళ్లీ పాత పార్లమెంట్ వెళ్లేందుకు ఎదురుచూస్తుంటాను అని కాంగ్రెస్ నేత అన్నారు.
ఇది భారతీయులను అవమానించడమే
జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ‘‘కాంగ్రెస్ పాటించే అత్యల్ప ప్రమాణాల్లో ఇదీ ఒకటి. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానిస్తోంది. పార్లమెంటుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆ పార్టీకి ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విధంగా మాట్లాడి విమర్శల పాలైంది’’అని కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Henry Kissinger: మోదీ ప్రసంగం వినేందుకు వీల్ఛైర్లో కిసింజర్ వచ్చిన వేళ..!
ప్రముఖ దౌత్యవేత్త, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్(Henry Kissinger) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వేళ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ(Modi) మాట్లాడారు. ఆ క్రమంలో సరదా సంభాషణ చోటుచేసుకుంది. -
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువును ఎన్టీఏ పొడిగించింది. ఈ కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. -
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
శత్రు జలాంతర్గములను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళానికి అదనపు శక్తి లభించింది. మూడు సరికొత్త యుద్ధ నౌకలు నేడు నౌకాదళానికి అందుబాటులోకి వచ్చాయి. -
కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. -
విమానంలో భార్యాభర్తల గొడవ.. దారి మళ్లించి దిల్లీలో దించివేత
బ్యాంకాక్కు బయలుదేరిన మ్యూనిక్ - బ్యాంకాక్ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. -
విధానసౌధ వాకిట గజరాజులు
చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. -
గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2015 బ్యాచ్కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
భారత్కు తిరిగొచ్చిన అంజూ
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్కు వచ్చింది. -
81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు
వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
భారత్లో అసాధారణ వాతావరణం
భారత్లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు
అహ్మదాబాద్ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
మేం దిల్లీ వీడుతాం!
ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు
హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. -
సొరంగం నుంచి కుమారుడు బయటకు రావడానికి కొన్ని గంటల ముందే తండ్రి మరణం
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది. -
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అప్రమత్తం
చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
గురుపత్వంత్ హత్యకు కుట్రపై దర్యాప్తునకు కమిటీ
సిక్స్ ఫర్ జస్టిస్’ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది. -
దిల్లీ విమానం ఆరున్నర గంటల ఆలస్యం
దిల్లీ విమాన సర్వీస్ ఆరున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది. -
16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. -
మణిపుర్లో శాంతి వీచిక
జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. -
గంటన్నరలో బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసు జాగిలం లియో
ముంబయిలో అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి జాడను పోలీసు జాగిలం ‘లియో’ కేవలం గంటన్నర వ్యవధిలో గుర్తించింది.


తాజా వార్తలు (Latest News)
-
Tata Tech: టాటా టెక్ అదుర్స్.. లిస్టింగ్ డే గెయిన్స్లో టాప్-7లోకి
-
Revanth Reddy: కాసేపట్లో రేవంత్రెడ్డి మీడియా సమావేశం
-
Henry Kissinger: మోదీ ప్రసంగం వినేందుకు వీల్ఛైర్లో కిసింజర్ వచ్చిన వేళ..!
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!