Rahul Gandhi: ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఇబ్బంది పడ్డ రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతోన్న బ్రిటన్ పర్యటన తాజాగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది.
దిల్లీ: కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న బ్రిటన్ పర్యటన తాజాగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది. భారతీయ సమాజంలో హింస, అహింస అనే అంశంపై ప్రశ్న ఎదురుకాగా.. సమాధానం చెప్పేందుకు రాహుల్ తడుముకొన్నట్లు కనిపించింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎదురైన ప్రశ్నపై స్పందించే ముందు రాహుల్ కొంత సమయం తీసుకున్నారు. ‘ఈ విషయంలో మొదట నాకు గుర్తొచ్చే పదం క్షమాపణ. ఇది కచ్చితమైందేమీ కాదు’ అంటూ సమాధానమిచ్చి మళ్లీ ఆగిపోయారు. దాంతో నిశ్శబ్దాన్ని చేధించేందుకు అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ‘దీనిపై సమాధానం చెప్పేందుకు నేను ఆలోచిస్తున్నాను’ అంటూ వారిని ఉద్దేశించి రాహుల్ అన్నారు. దాంతో ఆ పరిస్థితిని తేలిక పరిచేందుకు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి..‘మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయడం నా ఉద్దేశం కాదు. ఇంతకుముందు మిమ్మల్ని ఈ ప్రశ్న ఎవరు అడిగి ఉండకపోవచ్చు’ అంటూ క్షమాపణ తెలియజేశారు. ‘అలా ఏం లేదు. మీరు నన్నేం ఇబ్బంది పెట్టలేదు. దీనిపై లోతుగా సమాధానం ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ అంటూ కాంగ్రెస్ నేత వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరూ చిరునవ్వు చిందించారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై భాజపా తన విమర్శలకు పదును పెట్టింది. ముందుగా రాసిపెట్టుకున్న అంశాలపై మాట్లాడంటూ భాజపా నేత అమిత్ మాలవీయ ఈ వీడియోను ట్వీట్ చేశారు. కాగా, దీనిపై కాంగ్రెస్ నేతలు రాహుల్కు మద్దతుగా నిల్చారు. ‘ఉగ్రవాదుల దాడుల్లో నానమ్మ, తండ్రిని కోల్పోయిన బాధను భాజపా మిత్రులు అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఆయనకు ఎదురైన ప్రశ్నను క్షమాపణ అనే ఒకే ఒక్క పదంతో వివరించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని తక్కువ చేయొద్దు’ అంటూ రణ్దీప్ సూర్జేవాలా విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్