Jacqueline Fernandez: అమిత్ షా పేరు చెప్పి జాక్వెలిన్తో పరిచయం.. జయలలిత బంధువుగా స్నేహం!
మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో పరిచయంపై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అమిత్ షా ఆఫీస్ పేరు చెప్పి
దిల్లీ: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో పరిచయంపై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అమిత్ షా ఆఫీస్ పేరు చెప్పి సుకేశ్.. నటితో స్నేహం పెంచుకున్నాడని తెలిసింది. అంతేగాక, తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బంధువునని కూడా చెప్పాడట. ఇక జాక్వెలిన్కు ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఛార్జ్షీట్లో పేర్కొంది.
రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈ ఏడాదిలో రెండు సార్లు ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన దర్యాప్తు సంస్థ.. ఆ వివరాలను ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇటీవల ఈ ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. అందులోని వివరాల ప్రకారం.. సుకేశ్ తనను తాను ‘శేఖర రత్నవేలు’గా జాక్వెలిన్ను పరిచయం చేసుకున్నాడు.
‘‘2020 డిసెంబరు, 2021 జనవరిలో చాలా వారాల పాటు అతడు(సుకేశ్).. ఆమె(జాక్వెలిన్)తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కాల్స్కు ఆమె స్పందించలేదు. ఆ తర్వాత ఒకరోజు నటి మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముథాతిల్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి వచ్చినట్లు తలపించేలా ఆ కాల్ వచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ అలియాస్ శేఖర ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని, ఆయనతో నటి మాట్లాడాలన్నది ఆ కాల్ సారాంశం. దీంతో సుకేశ్ నంబరును మేకప్ ఆర్టిస్ట్.. జాక్వెలిన్కు ఇవ్వగా.. ఆమె అతడిని సంప్రదించింది. ఆ సమయంలో సుకేశ్ తనను తాను శేఖర రత్నవేలు అని, సన్ టీవీ ఓనర్గా పరిచయం చేసుకున్నాడు. అంతేగాక, తాను జయలలిత రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తినని, చెన్నై నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీకు(జాక్వెలిన్) పెద్ద అభిమానినని, దక్షిణాది చిత్రాల్లో నటించాలని కోరాడు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది’’ అని ఈడీ ఛార్జ్షీట్లో వెల్లడించింది.
ఆ కాల్ గురించి దర్యాప్తు చేయగా.. అది నకిలీ కాల్ అని తేలినట్లు ఈడీ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు సుకేశ్.. జాక్వెలిన్తో నిరంతరం టచ్లోనే ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఇక, సుకేశ్ నుంచి కోట్లాది రూపాయాల ఖరీదైన కానుకలు తీసుకున్నట్లు నటి.. ఈడీ విచారణ సమయంలో చెప్పినట్లు తెలిసింది. ఇందులో వజ్రాల చెవిపోగులు, బ్రాసెలైట్, డిజైనర్ బ్యాగ్లు వంటివి కూడా ఉన్నాయట.
కాలర్ ఐడీ స్పూఫింగ్తో హైటెక్ మోసం..
రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17ఏళ్ల వయసులోనే నేరాల్లోకి అడుగుపెట్టిన సుకేశ్.. ప్రముఖులు, సంపన్నులను మోసం చేయడమే లక్ష్యంగా నేరాలు చేస్తూ వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఫోన్ స్పూఫింగ్ టెక్నాలజీతో ప్రముఖులకు అతడు ఫోన్ చేసేవాడు. అతడు కాల్ చేసినప్పుడు.. అవతలి వ్యక్తి ఫోన్పై కాలర్ ఐడీలో ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్ వస్తున్నట్లు కన్పించేది. దీంతో వారు నమ్మి మోసపోయేవారని ఈడీ పేర్కొంది. జైల్లో నుంచి కూడా సుకేశ్ ఈ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా