Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఆయా రాష్ట్రాల్లో రైల్వేశాఖ అధికారులు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express) రైలు దుర్ఘటన ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. పశ్చిమ్బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు ఘోర ప్రమాదానికి గురికావడంతో పెను విషాదం నింపింది. సుదీర్ఘ ప్రయాణం సాగించే రైలు కావడం, రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియడం లేదు. కోరమాండల్ రైల్లో ప్రయాణించిన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 207 మందికి మృతి చెందడం, 900 మందికి పైగా క్షతగాత్రులు కావడంతో ప్రయాణికుల వివరాలు వెల్లడించడం కూడా రైల్వేశాఖ అధికారులకు కష్టతరంగా మారింది.
ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల నుంచి నుంచి ఫోన్కాల్స్ వస్తున్నప్పటికీ అధికారులు.. క్షతగాత్రుల వివరాలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్, ఖరగ్పూర్, కోల్కతాలోని ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన తరలించాలని, లేకపోతే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంటుందని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సూచిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు ప్రమాదం జరిగితే అర్ధరాత్రి వరకు కూడా రైల్వే అధికారులు ప్రమాదానికి గురైన బోగీల వివరాలు వెల్లడించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం బోగీ నంబర్లు వెల్లడించినా కొంత వరకు సమాచారం తెలుస్తుందని భావిస్తున్నారు.
అప్రమత్తమైన నాలుగు రాష్ట్రాలు..
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైల్లో తమ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారేమోనని పశ్చిమ్బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలోని అధికారులతో మిగిలిన 3 రాష్ట్రాల అధికారులు సంప్రదిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.