చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే..
పిల్లల్లో ఉండే సహజ రోగనిరోధక శక్తి, వారు తీసుకొనే టీకాల వల్ల వారిపై కరోనా అంతగా ప్రభావం చూపదని నిజామాబాద్కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు.
నిజామాబాద్: పిల్లల్లో ఉండే సహజ రోగనిరోధక శక్తి, వారు తీసుకొనే టీకాల వల్ల వారిపై కరోనా అంతగా ప్రభావం చూపదని నిజామాబాద్కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు. పిల్లల్లో కరోనా ప్రభావం, ఒక వేళ కరోనా సోకితే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై ఉన్న సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు.
* చిన్నారుల్లో కరోనా లక్షణాలు ఎలా ఉంటున్నాయి?
మొదటి దశతో పోలిస్తే రెండో దశలో పిల్లల్లో కరోనా కేసులు పెరిగినా వైరస్ తీవ్రత వారిపై అంతగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, నీరసం, వాసన తెలియకపోవడం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులను కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చు. కొందరు చిన్నారుల్లో వాంతులు, విరోచనాలతో పాటు కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు కూడా వస్తున్నాయి.
* ఎటువంటి సందర్భాల్లో ఆస్పత్రిలో చేర్చాల్సి ఉంటుంది? హోం ఐసోలేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
90 శాతం మంది పిల్లలు హోం ఐసోలేషన్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవడంతోనే కరోనా నుంచి బయటపడుతున్నారు. చిన్నారులకు ఎటువంటి లక్షణాలు లేకుండా తల్లికిగానీ, తండ్రికి గానీ కొవిడ్ సోకినట్లైతే వారిని ప్రత్యేకంగా సంరక్షించాలి. స్వల్ప లక్షణాలున్న చిన్నారులకు జ్వరం వచ్చినపుడు సాధారణ పారాసిటమాల్ సిరప్ వాడాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలుండొచ్చు. అలాంటి సందర్భాల్లో వారిని వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చాల్సి ఉంటుంది.
* కరోనా సోకిన తల్లి పాలను బిడ్డకు పట్టొచ్చా? అటువంటి సందర్భాల్లో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నవజాత శిశువులకు తల్లి పాలు నిస్సందేహంగా పట్టొచ్చు. వాటి ద్వారా కరోనా సోకుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి పెరగడంలో తల్లి పాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆ సమయంలో తల్లి తన చేతులు శుభ్రపరచుకొని, మాస్కు ధరించి పాలు పట్టాలి. ఒక వేళ తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఆ పాలను శుభ్రమైన కంటైనర్లోకి పిండి వాటిని శిశువుకు అందించాలి.
* చిన్నారుల్లో కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుంది?
చిన్నారుల్లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. వారిలో సహజంగా ఉండే రోగ నిరోధకశక్తితో పాటు వారికి తరచూ వేయించే టీకాల ప్రభావంతో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.
* ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులకు కరోనా సోకకుండా అడ్డుకోవచ్చు?
పిల్లలకు కరోనా పెద్దవారి నుంచే సోకుతుంది. కాబట్టి మనం జాగ్రత్తలు పాటిస్తూ వారిని సంరక్షించాలి. ఐదేళ్ల లోపు చిన్నారులకు మాస్కు అవసరం లేదు. ఐదేళ్లు పైబడిన చిన్నారులకు తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, మాస్కు ధరించడం వంటి వాటిని అలవాటు చేయాలి. తాజా పండ్లను పిల్లలు ఎక్కువగా తీసుకొనేలా చూడాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ వల్ల వారి రోగనిరోధకశక్తి బలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.