పెరుగుతున్న ఉత్పరివర్తనల ముప్పు!
ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వైరస్లో వేగంగా కొత్త మార్పులు (ఉత్పరివర్తనలు) చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు టీకాలు
వ్యాక్సినేషన్లో జాప్యంతో మరిన్ని ఇబ్బందులు
పరీక్షల్లో గుర్తించలేని స్ట్రెయిన్ రావొచ్చు
శాస్త్రవేత్తల హెచ్చరిక
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వైరస్లో వేగంగా కొత్త మార్పులు (ఉత్పరివర్తనలు) చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు టీకాలు వేయడంలో జాప్యం జరిగే కొద్దీ కొత్త రకాలకు ఆస్కారం పెరుగుతుందని నిపుణులు చెప్పారు. ప్రస్తుత పరీక్షా విధానాలు, చికిత్సలు, టీకాలను ఏమార్చే వైరస్ రకం (స్ట్రెయిన్) ఉత్పన్నమయ్యే ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరించారు. అందువల్ల ఏ మాత్రం అలసత్వానికి తావివ్వకుండా కొవిడ్ జాగ్రత్తలను కొనసాగించాలని సూచించారు.
కరోనా వైరస్లో జన్యు వైవిధ్యం నానాటికీ పెరుగుతోంది. కొత్త కేసుల ఉద్ధృతి పెరగడమే ఇందుకు కారణô. ప్రతి కొత్త ఇన్ఫెక్షన్.. మార్పు చెందడానికి వైరస్కు ఒక అవకాశం కల్పిస్తుందని నిపుణులు తెలిపారు. మహమ్మారి నియంత్రణపై పోరులో సాధించిన పురోగతిని ఇది దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త రకాలను గుర్తించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా కోరింది. బ్రిటన్ నుంచి వచ్చిన కొత్త రకం కరోనా.. మార్చి నాటికల్లా అమెరికాలోని వైరస్ రకాల్లో సింహ భాగాన్ని ఆక్రమిస్తుందని ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ (సీడీసీ) అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రకం వల్ల తీవ్ర అనారోగ్యం కలగనప్పటికీ అది చాలా సులువుగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల.. ఆసుపత్రిలో చేరే బాధితులు, మరణాల సంఖ్య పెరుగుతాయని పరిశోధకులు తెలిపారు. దీంతోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో మొదట వెలుగు చూసిన రెండు కొత్త కొత్త రకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ రకం ఇప్పుడు 30 దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి సాధ్యమైనన్ని చర్యలను చేపట్టాలని హార్వర్డ్ వర్సిటీ నిపుణుడు మైఖేల్ మినా వివరించారు. కొత్త రకాలు ఉద్భవించకుండా చూడటానికి ఇదే ఉత్తమ మార్గమని చెప్పారు.
ఒక్క మార్పుతో..
కరోనా వైరస్ను మరింత ప్రమాదకరంగా మార్చే ఉత్పరివర్తన ఎప్పుడైనా రావొచ్చని పరిణామక్రమ జీవశాస్త్రవేత్త పార్డిస్ సబేటి పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన వైరస్ రకం వల్ల యువత తీవ్ర అనారోగ్యం బారినపడటానికి ఆస్కారం తక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల వారు మాస్కులు ధరించడానికి, భౌతిక దూరం పాటించడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదని ఆమె తెలిపారు. అయితే ఒక్క ఉత్పరివర్తన వల్ల పరిస్థితి మొత్తం మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2014లో ఎబోలా విజృంభణ సమయంలోనూ సదరు వైరస్లో వచ్చిన ఒకేఒక్క మార్పుతో పరిస్థితి ప్రమాదకరంగా మారిన తీరును ఆమె అప్పట్లో వెలుగులోకి తెచ్చారు. కరోనాలో కొత్తగా వచ్చే రకాల వల్ల ప్రస్తుత వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఆ వైరస్ బయటపడని పరిస్థితి ఉత్పన్నం కావొచ్చని వివరించారు.
కొత్త చికిత్సలు అవసరం
ఇటీవల దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్లు.. యాంటీబాడీ చికిత్సలు లేదా కాన్వలసెంట్ ప్లాస్మాకు పెద్దగా స్పందించకపోవచ్చని కొన్ని ల్యాబ్ ప్రయోగాలు సూచిస్తున్నాయి. అందువల్ల ఒకే యాంటీబాడీ ఔషధాలకు బదులు బహుళ యాంటీబాడీలతో చికిత్స చేయడం వల్ల ప్రయోజనం ఉండొచ్చని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) నిపుణురాలు జానెట్ వుడ్కుక్ చెప్పారు.
ప్రయాణ ఆంక్షలతో ప్రయోజనం తక్కువే
వైరస్లు తమ సంఖ్యను పెంచుకునే క్రమంలో వాటి జన్యువుల్లో స్వల్ప మార్పులు సహజమే. వాటిలో కొన్ని మార్పులు.. వైరస్ వ్యాప్తి ఉద్ధృతం కావడానికి కారణమవుతాయి. గత ఏడాది మార్చిలో కరోనాలో డీ614జీ అనే ఉత్పరివర్తన వెలుగు చూసింది. కొద్దినెలల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్లలో సింహభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత మళ్లీ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవి ప్రజా ప్రయాణాల వల్ల ఉత్పన్నమైనవి కాకపోవచ్చని, ఇన్ఫెక్షన్లు పెరిగే కొద్దీ.. వైరస్ స్వతంత్రంగా ఎక్కడికక్కడ వీటిని సముపార్జించుకుంటోందని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాన్ జోన్స్ పేర్కొన్నారు. ప్రయాణ ఆంక్షలతో కొత్త రకాల వ్యాప్తికి సమర్థంగా అడ్డుకట్టపడకపోవచ్చని వివరించారు. ‘‘అదే స్థాయిలో లేదా అంతకన్నా ప్రమాదకరమైన రకాలు మన దేశంలోనూ ఉత్పన్నం కావొచ్చు’’ అని పేర్కొన్నారు. వైరస్లో మార్పుల వల్ల రీఇన్ఫెక్షన్లు పెరగొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రస్తుతానికి టీకాలు సరే..
వినియోగంలో ఉన్న కొవిడ్ టీకాలు సమర్థంగానే పనిచేస్తున్నాయని, సరిపడా రోగనిరోధక స్పందనను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వైరస్లో భారీగా జన్యు మార్పులు చోటుచేసుకుంటే టీకా ఫార్ములాలో మార్పు చేయాల్సి ఉంటుందన్నారు. టీకాలను సమర్థంగా వేస్తే.. వైరస్లో ఆ మార్పు రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చని ఉతా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆండ్రూ పావియా చెప్పారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్