Third Wave: అక్టోబర్నాటికి మూడో ముప్పు..?
భారత్లో అక్టోబర్ నాటికి థర్డ్వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నియంత్రణ సాధ్యమే అంటున్న నిపుణులు
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతికి వణికిపోయిన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తోన్న రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి థర్డ్వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే మూడో ముప్పును సమర్థంగానే నియంత్రించే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.
దేశంలో కరోనా ఉద్ధృతి, రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం గురించి జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో రాయిటర్స్ వార్తా సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. జూన్ 3 నుంచి 17 మధ్య చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 40మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. భారత్లో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్ ప్రక్రియను చూస్తుంటే రానున్న రోజుల్లో సంభవించే మరో ముప్పును నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అక్టోబర్లో మూడో ముప్పు!
దేశంలో కరోనా వైరస్ మూడో ముప్పు ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు బదులిచ్చిన 24మంది నిపుణుల్లో 21మంది అక్టోబర్ నాటికి మరోసారి విజృంభణ తప్పదని అభిప్రాయపడ్డారు. మరో ముగ్గురు మాత్రం నవంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్వేవ్ వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ప్రస్తుతం వైరస్ను ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే రానున్న ముప్పును సమర్థవంతంగా నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు స్పష్టం చేశారు.
పిల్లలపై ప్రభావమెంత?
మూడో విజృంభణ పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్నకు దాదాపు సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో మూడోవంతు (26మంది) అవుననే సమాధానమిచ్చారు. మరో 14 మంది మాత్రం పిల్లలకు ప్రమాదమేమీ లేదన్నారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడమే ముప్పుకు కారణమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎపిడమాలజిస్టు డాక్టర్ ప్రదీప్ బనాందూర్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి ఐసీయూ పడకలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ముప్పు ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని కొవిడ్పై కర్ణాటక ప్రభుత్వ సలహాదారు డాక్టర్ దేవీ శెట్టి హెచ్చరించారు. అయితే థర్డ్వేవ్లో చిన్నారులకు వైరస్ సోకినప్పటికీ తీవ్రత మాత్రం తక్కువగానే ఉండే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ మధ్యే వెల్లడించారు.
నియంత్రణ సాధ్యమే..
భవిష్యత్తులో వచ్చే కొత్తరకం వేరియంట్లు వ్యాక్సిన్పై అంతగా ప్రభావం చూపకపోవచ్చని, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు వాటిని సమర్థంగానే ఎదుర్కొంటాయని 25మంది నిపుణులు పేర్కొన్నారు. కరోనా వైరస్ ముప్పు మరో ఏడాదిపాటు ఉంటుందని సర్వేలో పాల్గొన్న 31 మంది నిపుణులు(75శాతం) స్పష్టం చేశారు. సెకండ్ వేవ్తో పోలిస్తే మూడో ముప్పును నియంత్రించవచ్చని, కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా స్పష్టం చేశారు. అక్టోబర్ నాటికి చాలామందికి వ్యాక్సిన్ అందడంతోపాటు రెండోవేవ్ వల్ల కలిగే రోగనిరోధకత దీనికి దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్ సమస్య అధిగమించగలిగేదే. ముఖ్యంగా వ్యాక్సిన్ల రాకతో ఇది సాధ్యం. వ్యాక్సిన్ పంపిణీతోపాటు, ప్రజలు వైరస్కు గురికావడం వల్ల రానున్న రెండేళ్లలో కరోనాపై భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ సాధిస్తుంది’ అని అంతర్జాతీయ వైరాలజీ నిపుణుడు రాబర్ట్ గల్లో అంచనా వేశారు. ఏదేమైనా మూడోముప్పును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!