Corona Update: ఆరు నెలల తర్వాత.. అత్యధిక కేసులు..
Corona cases Update: ఆదివారం కొత్తగా 3,824 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి.
దిల్లీ: భారత్లో కరోనా కేసులు ఆదివారం గణనీయంగా పెరిగాయి. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,824 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరగడం గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా క్రియాశీల కొవిడ్ కేసుల సంఖ్య 18,389కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొవిడ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4,47,22,605 కేసులు నిర్ధారణ అయ్యాయి. మృతుల సంఖ్య 5,30,881కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఐదుగురు కరోనా మూలంగా చనిపోయారు. దిల్లీ, హరియాణా, కేరళ, రాజస్థాన్లో ఒక్కరు చొప్పున మరణించారు. గతంలో చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని కేరళ ప్రభుత్వం నిన్నటి లెక్కల్లో నివేదించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా, వారం రోజుల పాజిటివిటీ రేటు 2.24 శాతంగా నమోదైంది. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Heart attack: పెళ్లి రోజే.. గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
-
India News
Odisha train Tragedy: లోకో పైలట్ తప్పిదం లేదు..! ‘సిగ్నల్ వ్యవస్థ’ను ఎవరు ట్యాంపర్ చేశారు..?
-
General News
CM KCR: చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదాం: కేసీఆర్