Corona Updates: 100మందికి పైగా బీటెక్ విద్యార్థులకు కరోనా.. అక్కడ స్కూళ్లకు 31వరకు సెలవులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
మాండ్య: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మాండ్య జిల్లాలోని పీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో కొవిడ్ కలకలం రేపింది. మొత్తం 125మందికి ఈ మహమ్మారి సోకగా.. వీరిలో 107 మంది విద్యార్థులు కాగా.. 18మంది హాస్టల్ సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మూడు హాస్టల్ భవనాల్లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీంతో స్థానిక అధికారులు క్యాంపస్కి వెళ్లి పరిశీలించారు. అధిక శాతం మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపారు. అందరూ ఐసోలేషన్లో ఉన్నట్టు వెల్లడించారు.
కేరళలో 63మందికి ఒమిక్రాన్
కేరళలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 63 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 591కి చేరినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మొత్తం ఒమిక్రాన్ బాధితుల్లో 401మంది లో-రిస్క్ దేశాల నుంచి రాగా.. 101 మంది హై-రిస్క్ దేశాల నుంచి వచ్చారన్నారు. అలాగే, 70మందికి రాష్ట్రంలో కాంటాక్టుల ద్వారా ఈ వైరస్ సోకగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 19మందిలో ఈ కొత్త వేరియంట్ బయటపడినట్టు ఆమె వెల్లడించారు.
50లక్షల మందికి పైగా ప్రికాషన్ డోసు పంపిణీ
దేశ వ్యాప్తంగా ఈనెల 10 నుంచి ప్రారంభించిన ప్రికాషన్ డోసు పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 50లక్షల మందికి పైగా హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, గడిచిన 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80లక్షల టీకా డోసులు పంపిణీ చేయడంతో ఆ సంఖ్య 158.04 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అర్హులైన వారంతా వచ్చి సాధ్యమైనంత త్వరగా ప్రికాషన్ డోసు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పుదుచ్చేరిలో 31వరకు విద్యాసంస్థలకు సెలవులు
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 31వరకు మూసి ఉంచుతున్నట్టు విద్యాశాఖ మంత్రి ఎ.నమశ్శివాయం వెల్లడించారు. మరోవైపు గడిచిన 24గంట వ్యవధిలో 6028 శాంపిల్స్ పరీక్షించగా.. 2093 కొత్త కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతిచెందారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 10,393కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 35.72శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.35శాతం; రికవరీ రేటు 91.27శాతంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఒడిశాలో కొవిడ్ విజృంభణ.. 1061మంది పిల్లలకు వైరస్
ఒడిశాలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 11,086 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 600 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 70,990 టెస్టులు చేయగా ఈ కేసులు బయటపడ్డాయనీ.. పాజిటివిటీ రేటు 15.62గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖుర్దా జిల్లాలో 3469 కేసులు రాగా.. సుందర్గఢ్లో 1416, కటక్లో 766 చొప్పున వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 80,914కి పెరిగింది. కొత్తగా వైరస్ సోకినవారిలో 1061మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఖుర్దా జిల్లాలో 27వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు