దేశంలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. వరుసగా నాలుగోరోజు 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,752 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.

Updated : 28 Feb 2021 11:52 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. వరుసగా నాలుగోరోజు 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,752 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. శనివారం 7.95 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 16,752 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731 కి చేరింది. కొత్తగా 11,718మంది వైరస్ బారి నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,07,75,169కు చేరి.. రికవరీ రేటు 97.10శాతంగా ఉంది. 
ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 113 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,57,051కి చేరింది. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  1,64,511 కి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 1,43,01,266కి చేరింది. 

మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 8,612 కేసులు నమోదు కాగా.. 51 మంది మహమ్మారి కారణంగా మరణించారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగం ఒక్క మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని