Schools Reopen: ‘ఆందోళన తగదు.. కరోనా తగ్గుతోన్న ప్రాంతాల్లోనైనా బడులు తెరవాలి’
దేశంలో కరోనా పరిస్థితులు కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. పాఠశాలల పునఃప్రారంభంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, కనీసం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న ప్రాంతాల్లోనైనా స్కూళ్లను తెరవాలని దిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా పరిస్థితులు కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. పాఠశాలల పునఃప్రారంభంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, కనీసం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న ప్రాంతాల్లోనైనా స్కూళ్లను తెరవాలని దిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమింగ్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్, ‘సార్స్- కోవ్- 2 వైరస్ ఎవల్యూషన్’పై డబ్ల్యూహెచ్వో సాంకేతిక నిపుణుల బృందం ఛైర్మన్ డా.అనురాగ్ అగర్వాల్ అన్నారు. ప్రజలు ప్రస్తుతం స్వల్ప జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలు నిర్వహించే దశలోకి మహమ్మారి ప్రవేశిస్తోన్నట్లు తెలిపారు. తాజాగా ఓ జాతీయ వార్తాసంస్థతో అగర్వాల్ మాట్లాడుతూ.. పిల్లలను బడులకు దూరంగా ఉంచడం వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ కంటే ఇదే పెద్ద సమస్య అని అభిప్రాయపడ్డారు.
‘పిల్లలకు కొవిడ్తో కలిగే అనర్థాల కంటే.. స్కూళ్లకు వెళ్లకపోవడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి కలిగే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి.. వారిని పాఠశాలలకు పంపాలనే విషయమై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అగర్వాల్ వివరించారు. దేశంలో అధిక వ్యాక్సినేషన్ రేటు, మెరుగుపడిన రోగనిరోధక శక్తి, ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండటం తదితర కారణాల నేపథ్యంలో.. ప్రజలు సైతం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడం మేలన్నారు. దేశంలోని అనేక నగరాల్లో మూడో వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని చెబుతూ.. ఫిబ్రవరి ప్రారంభం నాటికి రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని చెప్పారు.
మహమ్మారి ముగింపు దశ(ఎండ్గేమ్)పై మాట్లాడుతూ.. ఒకవేళ వైరస్ కనుమరుగు కావడమే ముగింపుగా భావిస్తే.. అది ఇప్పుడే సాధ్యపడదని తెలిపారు. కానీ.. పాఠశాలల పునః ప్రారంభం, చిన్నపాటి జాగ్రత్తలతో సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవడం ఎండ్గేమ్గా పరిగణిస్తే.. ఇది ఇప్పటికే ప్రారంభమై ఉండాలని చెప్పారు. మున్ముందు కరోనా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. వైరస్ భారీగా మార్పులు చెందితే తప్ప.. దాంతో కలిగే నష్టాలు తక్కువేనన్నారు. మరోవైపు.. ఆసుపత్రుల్లో చేరికలకు, మరణాలకు కారణమవుతున్నందున ఒమిక్రాన్ను ‘సహజ వ్యాక్సిన్’గా పరిగణించొద్దని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..