Corona virus: మళ్లీ బుసలు కొడుతున్న కరోనా.. ఇవి మరవొద్దు!
కరోనా మహమ్మారి (corona virus) మళ్లీ బుసలు కొడుతోంది. కొన్ని నెలలపాటు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఈ వైరస్ తన విజృంభణను ప్రదర్శిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి (corona virus) మళ్లీ బుసలు కొడుతోంది. కొన్ని నెలలపాటు తగ్గినట్టే తగ్గిన ఈ వైరస్.. మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 12,200లకు పైగా కొత్త కేసులు, 13 మరణాలు రావడం.. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ (Bhagat Singh Koshyari), ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి మరికొందరు ప్రముఖులు కొవిడ్ బారిన పడటంతో మరోసారి కలవరం మొదలైంది.
జూన్ తొలివారం నుంచి మళ్లీ ఉద్ధృతి..
దేశంలో మార్చి నెలాఖరు నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన కొవిడ్ కేసుల ఉద్ధృతి అనూహ్యంగా పెరుగుతోంది. మార్చి 20న దేశవ్యాప్తంగా కేవలం 1761 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్థిరంగా పెరుగుతూ మళ్లీ జూన్ ఆరంభంలో భారీ సంఖ్యలో పెరుగుదల నమోదైంది. గత కొన్ని వారాలుగా దిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల్లో భారీగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ వర్షా కాలంలో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటం మాత్రం ఆందోళనకు కారణమవుతోంది. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల నమోదవుతుండగా.. దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణలోనూ నిన్న ఒక్కరోజే 400లకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. గత 24గంటల వ్యవధిలో నమోదైన కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 81,687కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.94%గా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.90%గా ఉంది.
ఉద్ధవ్, కోహ్లీకి కొవిడ్ పాజిటివ్
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కరోనా బారినపడ్డారు. ఉదయం యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ రాగా.. సాయంత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సైతం ఈరోజు కొవిడ్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఆయన రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆర్టీ పీసీఆర్ టెస్టులో పాజిటివ్గా తేలడంతో వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇంకోవైపు, ఇప్పటికే కొవిడ్ బారినపడి దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాను పూర్తిగా కోలుకొనే దాకా ఈడీ విచారణ నుంచి మినహాయింపు కోరుతూ అధికారులకు లేఖరాశారు. మరోవైపు, టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కూడా కొవిడ్ సోకినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మ, కూమార్తె వామికాతో కలసి విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లి వచ్చాక కరోనా బారిన పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ కూడా కొవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 2020లో కరోనా బారిన పడిన అనిల్ విజ్.. దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొందారు.
వైద్యరంగ నిపుణుల సూచనలివే..
ప్రజలు కొవిడ్ నిబంధనల్ని గాలికొదిలేయడం, బూస్టర్ డోసులు వేసుకోకపోవడం వల్లే పలుచోట్ల కేసులు పెరుగుతున్నట్టు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అధిక జనసాంధ్రత కలిగిన భారీ, మెట్రో నగరాల్లోనే ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసుకోవడంతో పాటు భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రం చేసుకోవడం, టీకాలు వేయించుకోవడం వంటివి చేయాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులు పెరుగుతున్నా.. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ ముప్పు నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
మాస్క్ మరవకండి
కరోనాపై పోరాటంలో మాస్క్ ధరించడమే తొలి అస్త్రం. కరోనా అలజడి మొదలైనప్పట్నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు మాస్క్లు పెట్టుకొని ఉండటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చంటున్నారు వైద్యరంగ నిపుణులు.
టెస్ట్.. టెస్ట్..టెస్ట్.. ప్లీజ్!
కొవిడ్ అనుమానిత లక్షణాలు కనబడగానే వెంటనే టెస్ట్లు చేయించుకోవడంలో వెనకాడొద్దు. ఆలస్యం చేస్తే ఇతరులకు ఈ వైరస్ వ్యాప్తి చేసినవాళ్లమవుతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కోనడం ద్వారానే ఈ వైరస్ ముప్పు నుంచి బయట పడొచ్చంటున్నారు. కరోనాను గుర్తించి దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగే ఏకైక మార్గమని నిపుణులంతా చెబుతున్నమాట. భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వైరస్ను కట్టడిచేసే వ్యూహాలు అమలు చేయడం మరింత తేలికవుతుంది. అనుమానం వస్తే టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమం. కొవిడ్ టెస్ట్ ఫలితం కోసం వేచి చూడకుండా ఐసోలేట్ కావాలి. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలే లేని వారు సైతం పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వైరస్ బారిన పడకుండా మేలు చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ సంఖ్యలో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నాయి.
వ్యాక్సినే బ్రహ్మాస్త్రం..
కరోనాపై యుద్ధంలో టీకాయే బ్రహ్మాస్త్రం. టీకా వేసుకోవడం ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని మన గత అనుభమే చెబుతోంది. టీకా వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్గా వస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటోంది. అందుకే వైద్యరంగ నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా అర్హులైన ప్రతిఒక్కరూ బూస్టర్ డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదనే భరోసా లేనప్పటికీ ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు మాత్రం చాలా స్వల్పం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ సహా అనేక టీకాలు అందుబాటులో ఉన్నాయి.
రోగనిరోధక శక్తి పెంచుకోండి
మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శరీరానికి తగిన పోషకాహారాన్ని తీసుకోవడం కూడా ఎంతో అవసరం. రోగనిరోధక శక్తిని ఇనుమడింప జేసుకోవడం ద్వారా కరోనా బారినుంచి కొంత వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, మాంసం వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను అనుసరించడం వంటివి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ,బి,సి,డి,ఈ, జింక్ వంటి విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్ ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!