ఐదు అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
మొదలైన తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
ఇంటర్నెట్ డెస్క్: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. వివిధ కారణాల వల్ల ఈసారి ఈ బ్యాలెట్లు గతసారి కంటే నాలుగురెట్లకు పైగా పెరిగాయి. వీటి లెక్క పూర్తయ్యాక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరవబోతున్నారు. బెంగాల్లో తృణమూల్- భాజపా మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోరు సాగిందని, మమతకు కాస్త మొగ్గు ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఈ మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.
తిరుపతి లోక్సభ స్థానం..
తిరుపతి లోక్సభ నియోజక వర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. ఉప ఎన్నికలో మొత్తం 11,02,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీలైన వైకాపా నుంచి ఎం.గురుమూర్తి, తెదేపా నుంచి పనబాక లక్ష్మి, భాజపా తరఫున కె.రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతామోహన్ పోటీ చేశారు. వీరితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నాగార్జునసాగర్..
దివంగత తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిలో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండలోని అర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. 41 మంది అభ్యర్థులు పోటీపడిన ఎన్నికల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తరవాత గుర్రంపోడు మండలంలోని ఓట్లను లెక్కిస్తారు. ఈ సాయంత్రానికి విజేత ఎవరో తేలనుంది.
ఐదు అసెంబ్లీ స్థానాల్లో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..