Corona: చైనా టీకా.. ఆ దేశాల్లో మళ్లీ విజృంభణ!
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి.
చైనా టీకాల సామర్థ్యంపై మరోసారి చర్చ
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్, మంగోలియా, బహ్రెయిన్ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని భారీ స్థాయిలో చేపట్టాయి. దీంతో త్వరలోనే కొవిడ్ నుంచి బయటపడతామని భావించాయి. కానీ ఆ దేశాలు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. అక్కడ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోగా.. మరోసారి విజృంభణ మొదలుకావడంతో తలలు పట్టుకుంటున్నాయి.
68శాతం ప్రజలకు టీకాలు వేసినా ఎందుకలా?
వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో చైనా చాలా ముందుంది. కరోనా వైరస్ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన సీషెల్స్, చిలీ, బహ్రెయిన్, మంగోలియా దేశాలకు భారీ స్థాయిలో టీకాలు సరఫరా చేసింది. చైనాకు చెందిన సినోఫార్మ్, సినోవాక్ బయోటెక్ టీకాలపైనే ఆ దేశాలు ఆధారపడ్డాయి. వేగంగా టీకాల పంపిణీ చేపట్టిన అక్కడి ప్రభుత్వాలు.. దాదాపు 50 నుంచి 68శాతం ప్రజలకు వ్యాక్సిన్ అందించాయి. అనంతరం ఆ దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గకపోగా.. కేసుల సంఖ్య గణనీయంగా పెరగసాగింది.
ఇండోనేషియాలోనూ సినోవాక్ వ్యాక్సిన్ తీసుకున్న 350 మంది వైద్యులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వారిలో ఫిబ్రవరి-జూన్ మధ్యకాలంలోనే 61 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండోనేషియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఇలాంటి ఘటనలు సినోవాక్ వ్యాక్సిన్ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయని సింగపూర్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ కెన్నెత్ మార్క్ అభిప్రాయపడ్డారు. చైనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తే పలు దేశాల్లో ఈ రకమైన తీవ్రత కనిపించేది కాదని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన వైరాలజీ నిపుణులు జిన్ డోంగ్యాన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితికి చైనా బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా ఏవిధంగా చూసినా చైనా వ్యాక్సిన్లకు సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు రుజువవుతోందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నికొలాయ్ పెట్రోవ్స్కి స్పష్టం చేశారు.
కొత్తరకాలపై సందేహమే..!
వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమాతో కొవిడ్ నిబంధనలు పక్కకు పెట్టడం వైరస్ విజృంభణకు ఒక కారణమైతే.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాల ప్రభావం కూడా మరో కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రెండోసారి కరోనా వైరస్ బారినపడే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగోలియాలో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి నెల తర్వాత వైరస్ బారినపడడమే కాకుండా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇలాంటి ఘటనలను ఉదహరిస్తోన్న నిపుణులు.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలను ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు లేకపోవచ్చంటున్నారు. అంతేకాకుండా చైనా టీకా తయారీ సంస్థలు కొత్తరకాలపై తమ వ్యాక్సిన్లు పని చేస్తున్నాయో లేదోననే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
పేద దేశాల చూపులు చైనాటీకా వైపే!
అమెరికాలో ఇప్పటి వరకు 45శాతం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందింది. అక్కడ ఎక్కువగా ఫైజర్, మోడెర్నా టీకాలనే తీసుకున్నారు. దీంతో గత ఆరునెలల కాలంలో కేసుల సంఖ్య 94శాతం తగ్గింది. ఇక ఇజ్రాయెల్లో దాదాపు ఫైజర్ టీకానే దేశమంతా పంపిణీ చేయగా.. అక్కడ కూడా కేసుల సంఖ్య ప్రతి పదిలక్షల జనాభాకు 4.95కు తగ్గింది. కానీ భారీ స్థాయిలో సినోఫార్మ్ టీకాను అందించిన సీషెల్స్లో మాత్రం కేసుల సంఖ్య ప్రతి పదిలక్షల జనాభాకు 716గా నమోదయింది. దాంతో చైనా వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మంగోలియాలోనూ 52శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాలు ఫైజర్, మోడెర్నా వంటి సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా.. పేద దేశాలు మాత్రం చైనా టీకాలవైపే చూస్తున్నాయి. దాదాపు 90దేశాలు చైనా టీకాలను సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైనా వ్యాక్సిన్లు తగినంత ప్రభావం చూపకపోతే వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోగాల సమాచారంపై గోప్యత!
కరోనాను ఎదుర్కోవడంలో ఫైజర్, మోడెర్నా వంటి టీకాల సామర్థ్యం 90 శాతానికిపైగా ఉండగా.. ఆస్ట్రాజెనికా, జే&జే టీకాల ప్రభావశీలత 70 శాతానికి పైగా ఉంది. అయితే చైనా సినోఫార్మ్ టీకా సామర్థ్యం 78శాతం అని చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని బహిరంగపరచలేదు. అంతేకాక సినోవాక్ వ్యాక్సిన్ పనితీరు కేవలం 51 శాతం అని పేర్కొన్న చైనా.. వాటి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో 70శాతం మందికి వ్యాక్సిన్ అందిస్తే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించవచ్చని చైనా ప్రకటించింది. కానీ తాజాగా 80శాతం నుంచి 85శాతం మందికి వ్యాక్సిన్ అందిస్తేనే అది సాధ్యమవుతుందని చైనా సీడీసీ ప్రకటించడం గమనార్హం.
తాజా విజృంభణలకు సంబంధం లేదు
చైనా టీకాలు పంపిణీ చేస్తోన్న దేశాల్లో మళ్లీ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో చైనా స్పందించింది. తాజా విజృంభణకు, వ్యాక్సిన్ల పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. చైనా వ్యాక్సిన్లను అందుకున్న చాలా దేశాలు తమ టీకాలు సురక్షితమైనవని, నమ్మకమైనవని పేర్కొంటున్నాయని తెలిపింది. భవిష్యత్తులో సంభవించే కరోనా విజృంభణలను ఎదుర్కొనే స్థాయికి పలు దేశాలు ఇంకా చేరుకోలేదని, అందుచేత కొవిడ్ నిబంధనలను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని చైనా గుర్తుచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు