Deoghar rescue: మీ వీరోచిత సాహసానికి యావత్ దేశం గర్విస్తోంది: మోదీ
ఝార్ఖండ్ దేవ్ధర్ త్రికూట పర్వతాల వద్ద జరిగిన రోప్వే ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసల్లో ముంచెత్తారు......
దిల్లీ: ఝార్ఖండ్ దేవ్ధర్ త్రికూట పర్వతాల వద్ద జరిగిన రోప్వే ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసించారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, వాయుసేన, ఐటీబీపీ, స్థానిక యంత్రాంగంతో వర్చువల్గా ప్రధాని మాట్లాడారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రజలను కాపాడగలిగేలా నైపుణ్యాలు ఉన్న బలగాలు ఉన్నందుకు దేశం గర్విస్తోందన్నారు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని, భవిష్యత్తులో తమ అనుభవాలు ఉపయోగపడతాయని సిబ్బందిని ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు.
‘మూడు రోజుల వ్యవధిలో.. మీరు ప్రతి క్షణం పనిచేసి కష్టతరమైన ఆపరేషన్ను పూర్తిచేశారు. ఎందరో పౌరుల ప్రాణాలను కాపాడారు. మీ వీరోచిత ప్రయత్నాలను చూసి దేశం మొత్తం అభినందిస్తోంది. కొంతమంది ప్రాణాలు కాపాడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని మోదీ అన్నారు.
దేవ్ఘర్ జిల్లా త్రికూట పర్వతాల వద్ద తీగల మార్గంలో ఆదివారం సంభవించిన ప్రమాదంలో కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన 60 మందిని అధికారులు కాపాడారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 46 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!