UK Covid: యూకేలో ప్రైవేటు ల్యాబ్ నిర్వాకం.. 43 వేల మందికి తప్పుడు కొవిడ్ ఫలితాలు!
యూకేలోని ఓ ప్రైవేటు ల్యాబ్లో ఆయా సమస్యల కారణంగా అందులో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న దాదాపు 43 వేల మందికి తప్పుడు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వోల్వర్హాంప్టన్లో...
లండన్: యూకేలోని ఓ ప్రైవేటు ల్యాబ్లో ఆయా సమస్యల కారణంగా అందులో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న దాదాపు 43 వేల మందికి తప్పుడు నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వోల్వర్ హాంప్టన్లో ఉన్న ఆ ల్యాబ్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిలిపివేసినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ(యూకేహెచ్ఎస్ఏ) శుక్రవారం ప్రకటించింది. ‘ఆ ల్యాబ్లో దాదాపు నాలుగు లక్షల నమూనాలు పరీక్షించారు. అందులో చాలావరకూ నెగెటివ్ వచ్చాయి. కానీ, వాటిలో 43 వేల వరకు తప్పుడు నెగెటివ్ ఫలితాలు ఉండవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 12 మధ్య ఈ రిజల్ట్స్ వచ్చాయి’ అని పేర్కొంది.
‘మరోసారి టెస్టులు చేయించుకోండి’
సదరు ల్యాబ్లో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ వచ్చినవారు.. మళ్లీ బయట టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఈ విషయం బయటపడింది. దీంతో సదరు వ్యక్తులు మరోసారి టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. మరోవైపు అధికారులు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ల్యాబ్ను నిర్వహిస్తున్న ‘ఇమ్మెన్సా హెల్త్ క్లినిక్’ వెల్లడించింది. ఈ వ్యవహారంపై యూకేహెచ్ఎస్ఏలోని పబ్లిక్ హెల్త్ ఇన్సిడెంట్ డైరెక్టర్ డాక్టర్ విల్ వెల్ఫేర్ మాట్లాడుతూ.. ఆర్టీ- పీసీఆర్, ఎల్ఎఫ్డీ టెస్ట్ కిట్లలో ఎలాంటి లోపాలు లేవని, సదరు పరీక్షలు నిర్వహిస్తున్న ఇతర ల్యాబ్ల సేవలను నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చని పౌరులకు వివరించారు.
రోజుకు పది లక్షల మందికి..
దేశవ్యాప్తంగా ఆయా పరీక్షా కేంద్రాల్లోనూ ఈ తరహా సమస్యలు తలెత్తినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్(డీహెచ్ఎస్సీ) వెల్లడించింది. ఇదే క్రమంలో ఇంగ్లాండ్లోని స్థానిక అధికార సంస్థ ‘వెస్ట్ బెర్క్షైర్ కౌన్సిల్’ సైతం అక్టోబర్ 3- 12 మధ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యూబరీ షోగ్రౌండ్ సైట్లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్న నివాసితులు మరోసారి టెస్టులు చేయించుకోవాలని సూచించడం గమనార్హం. తప్పుడు నెగెటివ్ ఫలితాలు వచ్చినందునే ఈ సూచన వెలువరించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ తప్పుడు ఫలితాల విషయంలో పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ప్రస్తుతం రోజుకు 10 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్