
సెకండ్ వేవ్.. ఏప్రిల్ రెండోవారంలో పీక్!
దిల్లీ: కరోనా వైరస్ రెండో దశ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 80 వేలు దాటింది. దేశంలో సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్లు గుర్తించగా.. ఈ విజృంభణ ఏప్రిల్ నెల రెండో వారం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దేశంలో కరోనా తొలి దశ ఉద్ధృతి కొనసాగిన సమయంలో వైరస్ తీవ్రతను సూత్రా అనే గణాంక పద్ధతి ద్వారా కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2020 సెప్టెంబర్ నెలలో వైరస్ తీవ్రత గరిష్ఠానికి చేరుకొని.. 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే తరహాలో ప్రస్తుతం రెండో దశ కొవిడ్ ఉద్ధృతిని కూడా అంచనా వేస్తున్నారు.
‘ప్రస్తుతం దేశంలో పెరుగుతోన్న కరోనా కేసుల తీరును చూస్తే ఏప్రిల్ 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. అదే తీరుతో కాస్త తగ్గుముఖం పడుతూ.. మే చివరి నాటికి గణనీయంగా తగ్గుతుంది’ అని అధ్యయనంలో పాల్గొన్న ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ పేర్నొన్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యిందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి.. చివరకు తగ్గుముఖం పడుతుందన్నారు. ఇప్పుడున్న తీవ్రతను బట్టి చూస్తే మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. రాష్ట్రాల వారీగా కేసుల్లో తేడా ఉన్నప్పటికీ ఏప్రిల్ రెండో వారం నాటికి వైరస్ ఉద్ధృతి గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. హరియాణాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మేనన్ అంచనా ప్రకారం కూడా ఏప్రిల్, మే నాటికి వైరస్ ఉద్ధృతి అధిక స్థాయికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.
వైరస్ ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరే అంశాన్ని అంచనా వేయడంలో మూడు అంశాలు కీలకంగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి రేటు (ఆర్ నాట్), వైరస్ సోకే అవకాశమున్న జనాభా, నిర్ధారితమవుతున్న కేసులను ఆధారం చేసుకుని ఈ విధానంలో అంచనా వేస్తున్నట్లు కాన్పూర్ శాస్త్రవేత్తలు వివరించారు. నిర్ధారణ పరీక్షల సంఖ్యను బట్టి వెలుగుచూసే కొవిడ్ కేసుల్లో మార్పులు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ranbir Kapoor: ఆరోజు నేను చేసిన పనికి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది: రణ్బీర్ కపూర్
-
Politics News
Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?
-
General News
Telangana News: 28న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
-
Sports News
Umran Malik: ఉమ్రాన్ రాణిస్తున్నాడు.. ప్రపంచకప్ జట్టులో ఉండాలి : వెంగ్సర్కార్
-
World News
Ukraine Crisis: రష్యా బంగారంపై నిషేధం ?
-
India News
Aaditya Thackeray: పిరికివారే వెళ్లిపోయారు.. దమ్ముంటే శివసేనను వీడి పోరాడండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్లో ఆప్కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్పోర్ట్లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Agnipath: అగ్నిపథ్కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?