Bihar: చెత్తకుప్పలో కరోనా టీకాలు

బిహార్  బక్సార్  జిల్లాలోని ఓ చెత్తకుప్పలో కరోనా టీకాలు ప్రత్యక్షమయ్యాయి. రఘునాథ్‌పూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలోని డంపింగ్

Published : 24 Jan 2022 16:40 IST

పట్నా: బిహార్ బక్సార్ జిల్లాలోని ఓ చెత్తకుప్పలో కరోనా టీకాలు ప్రత్యక్షమయ్యాయి. రఘునాథ్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలోని డంపింగ్ ప్రదేశంలో కొవిడ్ టీకాలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున టీకాలు పడేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చెత్తలో పడి ఉన్న టీకాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కమ్యూనిటీ హెల్త్  సెంటర్  మేనేజర్  వినోద్ కుమార్ వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని