Corona virus: దిల్లీ, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతం.. రోజురోజుకీ కేసులు పైపైకి!
ముంబయి: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా మహారాష్ట్రలో 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 3081 కొత్త కేసులు రాగా.. 1323మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అయితే, ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. మహారాష్ట్రలో బుధవారం 2701 కేసులు రాగా.. నిన్న 2,813 కొత్త కేసులు వచ్చాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఒక్కరోజు కేసులు 3వేల మార్కును దాటడం గమనార్హం. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలుపుకొంటే మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,329కి పెరిగినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అధిక భాగం ముంబయిలోనే. నగరంలో గడిచిన 24గంటల వ్యవధిలో 15,346 టెస్టులు చేయగా.. 1956మందిలో వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు బీఎంసీ అధికారులు తెలిపారు. ముంబయిలో ప్రస్తుతం 9191 క్రియాశీల కేసులు ఉండగా థానెలో 2157, పుణెలో 884, రాయిగఢ్లో 411 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దిల్లీలోనూ పెరిగిన కేసులు..
దిల్లీలోనూ కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న 622 మందికి వైరస్ సోకగా.. తాజాగా మరో 655 మందిలో ఈ మహమ్మారి వెలుగుచూసింది. తాజాగా 419మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. కరోనాతో పోరాడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో దిల్లీలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 19,11,268కి చేరింది. వీరిలో 18,83,042 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 26,218 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2008కి ఎగబాకింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Headaches: గర్భిణికి తలనొప్పా..? వస్తే ఏం చేయాలో తెలుసుకోండి..!
-
Sports News
Chess Olympiad: చెస్ ఒలింపియాడ్లో భారత్కు రెండు కాంస్య పతకాలు
-
World News
Sri Lanka Crisis: శ్రీలంకవాసులకు ‘షాక్’! విద్యుత్ ధరల్లో 264 శాతం పెంపు
-
Movies News
Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
-
India News
Corona: ఖర్గేకు మళ్లీ కరోనా పాజిటివ్.. నిన్న రాజ్యసభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత!
-
India News
Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- BSNL నుంచి లాంగ్ప్లాన్.. ఒక్కసారి రీఛార్జి చేస్తే 300 రోజులు బిందాస్