భారత్లో 3 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు
కరోనా వైరస్ మహమ్మారి విలయానికి యావత్ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 34లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు.
కొవిడ్ మరణాల్లో ప్రపంచంలో మూడో స్థానం..
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విలయానికి అన్ని దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 34లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. వీటిలో అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉండగా మూడు లక్షల మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఆయా రాష్ట్రాలు వెల్లడించిన నివేదికల ప్రకారం, దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య ఆదివారం నాటికి మూడు లక్షలు దాటింది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్తో విలయతాండవం చేస్తున్న వేళ.. భారత్లో నిత్యం దాదాపు 4వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధిక కొవిడ్ మరణాలు మహారాష్ట్రలో సంభవిస్తుండగా.. తాజాగా కర్ణాటకలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 626 కరోనా మరణాలు నమోదయ్యాయి. మొన్నటివరకు మహారాష్ట్రలో నిత్యం దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా ఆసంఖ్య 600 దిగువకు చేరింది. ఆదివారం నాడు మహారాష్ట్రలో 594 కరోనా మరణాలు రికార్డయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఆదివారం ఉదయానికి దేశవ్యాప్తంగా 2లక్షల 99వేల కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజాగా ఆయా రాష్ట్రాలు ప్రకటించిన రోజువారీ నివేదికలతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 3లక్షల దాటింది.
మూడో స్థానంలో భారత్...
ప్రపంచంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అత్యధిక కరోనా మరణాలు అమెరికాలో (5,89,000) చోటుచేసుకున్నాయి. కరోనా తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్న బ్రెజిల్లో కొవిడ్ మరణాలు 4లక్షల 48వేలు దాటాయి. కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్లో ఈ సంఖ్య 3 లక్షల మార్కును దాటింది. మెక్సికోలో 2లక్షల 22 వేల మంది ప్రాణాలు కోల్పోగా, బ్రిటన్లో లక్షా 27వేల మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 34 లక్షల 55వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)