Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
మహమ్మారి నుంచి స్థానికవ్యాప్తి (Endemic) దశకు వచ్చే సమయంలో ఇలా కొవిడ్ కేసుల్లో హెచ్చు తగ్గులు సర్వసాధారణమేనని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ (Coronavirus) ఉద్ధృతి మళ్లీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే, మహమ్మారి నుంచి స్థానికవ్యాప్తి (Endemic) దశకు వచ్చే సమయంలో ఇలా కొవిడ్ కేసుల్లో హెచ్చు తగ్గులు సర్వసాధారణమేనని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ కొన్ని జిల్లాలకే పరిమితమైందని పేర్కొంటున్న నిపుణులు.. మాస్కులు ధరించకపోవడం, ప్రయాణాలు, సామాజిక కార్యక్రమాలు పెరగడంతోపాటు బూస్టర్ డోసులు (Booster Dose) తీసుకోకపోవడం కూడా వైరస్ విస్తృతంగా వ్యాపించడానికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఎండెమిక్ దశ..
కరోనా వైరస్లో ఇప్పటికే వెయ్యి మ్యుటేషన్లు (Mutations) జరిగినప్పటికీ అందులో కేవలం ఐదు మాత్రమే ఆందోళనకరమైనవని ఎయిమ్స్లో సీనియర్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. ‘ఒమిక్రాన్ (Omicron) విషయంలోనూ ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్నందునే రీఇన్ఫెక్షన్, బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మహమ్మారి (Pandemic) నుంచి స్థానికవ్యాప్తి (Endemic) దశకు మార్పు చెందే క్రమంలో కొవిడ్ కేసులు పెరగడం సాధారణ విషయమే. తీవ్రమైన, ఆస్పత్రిలో చేరికలు, మరణాల సంఖ్య పెరగనంత వరకు పాజిటివ్ కేసులు పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది వైరస్ బారినపడి కోలుకోవడం, మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందడం జరిగింది. వ్యాక్సిన్తోపాటు వైరస్ బారినపడి కోలుకోవడం వల్ల పొందిన రోగనిరోధకత సుదీర్ఘకాలంపాటు రక్షణ కల్పిస్తుందని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ రక్షణను క్షీణింపజేసే కొత్త వేరియంట్ (New Variant) వస్తే తప్ప ఎటువంటి ఆందోళన అవసరం లేదు’ అని కొవాగ్జిన్ (Covaxin) ప్రయోగాల్లో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా పనిచేసిన డాక్టర్ రాయ్ స్పష్టం చేశారు.
ఆందోళన అవసరం లేదు..
అంటువ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల కేసుల్లో ఇలా హెచ్చుతగ్గులు కనిపించడం సాధారణమేనని ప్రముఖ ఎపిడమాలజిస్టు డాక్టర్ చంద్రకాంత్ లహారియా స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో సాధారణ కేసుల సంఖ్య కాకుండా కేవలం తీవ్ర లక్షణాలు, ఆస్పత్రి చేరికలు ఉంటేనే వాటిపై శ్రద్ధ పెట్టాలని.. అటువంటివి లేనప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం వైరస్ విస్తృతి కొన్ని జిల్లాలు, ప్రాంతాలకే పరిమితమైందని.. ఇవి రాష్ట్రం మొత్తం నమోదవుతున్నట్లు చూడవద్దని ఐసీఎంఆర్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేవలం కొవిడ్ కాకుండా టీబీ వంటి వ్యాధులను నివారించేందుకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
భారీగా పాజిటివిటీ రేటు..
మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జూన్ 10 తర్వాత కొవిడ్ కేసుల్లో పెరుగుదల గణనీయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లో వారాంతపు కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదుకాగా కేవలం కేరళలోనే 12 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్ర, మిజోరం, అస్సాం, రాజస్థాన్, దిల్లీల్లోని పలు జిల్లాల్లో వైరస్ విస్తృతి ఎక్కువగా ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, రోజువారీ కేసుల సంఖ్య 17వేలకు చేరుకుంది. పాజిటివిటీ రేటు కూడా నాలుగు శాతం దాటడంతో నాలుగో వేవ్పై (Fourth Wave) ఆందోళన నెలకొంది. దీంతో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.