Covid Updates: మృతుల్లో 75% టీకా తీసుకోనివారే... 31 వరకు అక్కడ స్కూళ్లు బంద్
భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో.......
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2.64లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. రోజురోజుకీ కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న వేళ పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షల్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాయి.
మధ్యప్రదేశ్లో 31వరకు స్కూళ్లు బంద్
మధ్యప్రదేశ్లో కొవిడ్ తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, హాస్టళ్లను జనవరి 31వరకూ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయడంతో పాటు మతపరమైన కార్యక్రమాలు, కమర్షియల్ ఫెయిర్లు, ర్యాలీలపైనా నిషేధం విధిస్తున్నట్టు అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ రాజేశ్ రాజోరా తెలిపారు. రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన, సామాజిక, వినోద సంబంధిత కార్యక్రమాలకు 250మందిని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు. అలాగే, క్రీడా స్టేడియాల్లో 50శాతం సిటింగ్ సామర్థ్యంతోనే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రజలంతా కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యప్రదేశ్లో 4031 కొత్త కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి.
దిల్లీలో కొవిడ్ మృతుల్లో 75శాతం టీకా తీసుకోనివారే..: సత్యేందర్ జైన్
దిల్లీ: గత కొన్ని రోజులుగా దిల్లీలో కరోనా సునామీ కొనసాగుతోంది. కొవిడ్తో మృతిచెందినవారిలో దాదాపు 75శాతం మంది టీకాలు తీసుకోనివారేనని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. జనవరి 9నుంచి 12 వరకు 97మంది కొవిడ్తో మృతిచెందగా.. వారిలో 70మంది టీకాలు తీసుకోనివారు కాగా.. 19మంది కేవలం తొలిడోసు మాత్రమే తీసుకున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, 8మంది మాత్రమే రెండు డోసులూ తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో టీకాలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని మంత్రి సూచించారు. దిల్లీలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం 13వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.
ఎన్నికలు వాయిదా వేయొచ్చేమో చూడండి: కోల్కతా హైకోర్టు
కోల్కతా: బెంగాల్లోని పలుచోట్ల జరగాల్సిన పురపాలక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కోల్కతా హైకోర్టు కీలక సూచనలు చేసింది. కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్నవేళ నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించింది. నాలుగు నుంచి ఆరు వారాల పాటు వాయిదా వేసే అవకాశం ఉందేమో చూడాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ అజోయ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది. 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. కొవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో నాలుగు చోట్ల జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల వాయిదా అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. మరోవైపు, బిధ్నానగర్, చందన్నగర్, సిలిగురి, అనాసోల్ మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికల నిర్వహణకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని ప్రకటించింది.
కర్ణాటకలో రికార్డుస్థాయిలో టెస్ట్లు.. కేసులెన్నంటే?
బెంగళూరులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటక వ్యాప్తంగా 28,723 కేసులు రాగా.. వాటిలో ఒక్క బెంగళూరు నగరం పరిధిలోనే 20,121 పాజిటివ్ కేసులు వెలుగుచూడటం గమనార్హం. కొవిడ్ మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి గడిచిన 24గంటల వ్యవధిలో 2.21లక్షల టెస్ట్లు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిపాలవుతున్నవారి సంఖ్య మాత్రం 6శాతంగానే ఉన్నట్టు తెలిపారు. అయితే, నర్సింగ్ సిబ్బంది కొవిడ్ బారినపడుతుండటం ఆందోళనకంగా మారుతోందని చెప్పారు. ఫిబ్రవరి తొలి వారానికి థర్డ్వేవ్ గరిష్ఠానికి చేరుకుంటోందనీ.. ఆ తర్వాత మూడు లేదా నాలుగో వారంలో తగ్గుదల మొదలవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నారు. కర్ణాటకలో తాజాగా 14మంది కొవిడ్తో మృతిచెందగా.. వారిలో బెంగళూరు నగరంలోనే ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 12.98శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,41,337 యాక్టివ్ కేసులు ఉండగా.. ఒక్క బెంగళూరు మహానగరంలోనే 1.01లక్షల కేసులు ఉన్నాయి.
దిల్లీలో కాస్త తగ్గిన కేసులు..
దేశ రాజధాని దిల్లీలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో హస్తినలో 24,383 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. నిన్నటి(28,867)తో పోలిస్తే ఇవి 15.5శాతం తక్కువ. కాగా పాజిటివిటీ రేటు 30.64 శాతానికి చేరుకుంది. ఇదిలా ఉంటే 24 గంటల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంత రాజధానిలో మరణాల సంఖ్య 25,305కు చేరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2529 మంది సర్కారు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 815 మంది ఆక్సిజన్ పడకల్లో ఉండగా, 99 మంది వెంటిలేటర్ల సహాయంతో చికిత్స పొందుతున్నారు.
కేరళలో 23 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు..
కేరళలో శుక్రవారం 68,971 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 16,338 మందికి నిర్ధరణ అయ్యింది. దీంతో పాజిటివిటీ రేటు 23.7శాతంగా నమోదైంది. వైరస్తో తాజాగా 20 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 50,568కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 76,819కు చేరింది. అయితే ప్రస్తుతమున్న యాక్టివ్ కేసుల్లో 4.4శాతం మంది మాత్రమే హాస్పిటళ్లలో చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు.
ముంబయిలో 11 వేలకుపైనే..
దేశ ఆర్థిక రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. శుక్రవారం 11,317 మందికి పాజిటివ్గా తేలింది. నిన్నటితో పోలిస్తే ఈ కేసులు 17శాతం తక్కువ. పాజిటివిటీ రేటు 20.6 శాతానికి తగ్గింది. ఇది నిన్న 21.73గా ఉంది. అయితే గురువారంతో పోలిస్తే 12.86శాతం పరీక్షల్లో తగ్గుదల ఉంది. 24 గంటల్లో తొమ్మిది మంది మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్
పొరుగు దేశాలతో భారత సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రశంసలు కురిపించింది. -
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
Chandrayaan: చంద్రుడి ఉపరితలంపై భారతీయుడు అడుగు పెట్టేవరకు భారత జాబిల్లి యాత్రలు కొనసాగుతాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. -
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. -
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ
తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. -
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. -
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్