Vaccination: నిత్యం కోటి మందికి పంపిణీ లక్ష్యంగా!
దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ ఎన్కే అరోరా
దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. జులై చివరినాటికి 22కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్న ప్రభుత్వం.. వచ్చే నెల నుంచి నిత్యం కోటి డోసులను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఇక ప్రస్తుతానికి కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని మార్చే అవసరం లేదని.. వ్యాక్సిన్ పనితీరుపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ జరుపుతున్నామని వెల్లడించింది.
జులై చివరి నాటికి 22కోట్ల డోసులు..
‘ప్రతినిత్యం కనీసం కోటి మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజు కోటి 25లక్షల డోసులు పంపిణీ చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది’ అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. మార్గదర్శకాలను సవరించిన తొలిరోజునే దాదాపు 82.7లక్షల మందికి టీకాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి వ్యాక్సిన్ సరఫరా చేసే విధంగా వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని.. ముఖ్యంగా కొండ, గిరిజన ప్రాంతాలకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నామని ఎన్కే అరోరా తెలిపారు. టీకాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఫ్రంట్లైన్ వర్కర్లతోపాటు ఆశా వర్కర్ల ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎన్కే అరోరా చెప్పారు.
కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిపై..
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిపై మాట్లాడిన ఎన్కే అరోరా.. ప్రస్తుతం ఈ గడువును మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేషనల్ వ్యాక్సిన్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి సమాచారం సేకరిస్తూ.. వ్యాక్సిన్ల వాస్తవిక సామర్థ్యం, డోసుల మధ్య వ్యవధి, వేరియంట్ల ప్రభావంపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామన్నారు. ప్రస్తుతం రెండు డోసుల గడువుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కనీసం ఒక్కడోసు టీకాతో ప్రయోజనాలే కలుగుతున్నాయని చెప్పారు.
భారీ పంపిణీ కొత్తేమీ కాదు..
రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం మనకు కొత్తేమీ కాదని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. కేవలం ఒకేవారంలో 17కోట్ల చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏదైనా భారీ కార్యక్రమాన్ని తలపెడితే.. దాన్ని సాధించే సామర్థ్యం భారత్కు ఉందన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ఎన్కే అరోరా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను, అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ టీకా తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటివరకు 28కోట్ల 87లక్షల వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. వీరిలో 23కోట్ల మంది కనీసం ఒకడోసు తీసుకోగా.. మరో ఐదు కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. నిన్న ఒక్కరోజే గరిష్ఠంగా 86లక్షల డోసులను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు