మా టీకా సురక్షితమే.. ఆస్ట్రాజెనెకా
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ
దిల్లీ: వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఖండించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని యూరప్లోని కొన్ని దేశాలు తాత్కాలికంగా నిలిపి వేస్తుండటంపై సంస్థ సోమవారం స్పందించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తంలో సమస్యలు ఏర్పడటానికి టీకాకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకడుతోందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చి చెప్పినట్లు ప్రకటించింది. దీంతో తమ వ్యాక్సిన్ అందరికీ సురక్షితమని సంస్థ వివరించింది.
‘ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ శాస్త్రీయంగా నిరూపితమైంది. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.. టీకాను తయారు చేశాం. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకూ యూరప్, యూకేలలో సుమారు 17 మిలియన్ల మంది టీకా తీసుకున్నారు. ఇక ముందు కూడా ఎటువంటి సందేహం లేకుండా వ్యాక్సిన్ పొందవచ్చు. సాధారణ సమయంలోనూ రక్తంలో సమస్యలు ఏర్పడతాయి. వాటిని వ్యాక్సిన్తో ముడిపెట్టవద్దు. వ్యాక్సినేషన్ అనంతరం చాలా మందిలో రక్తం గడ్డకడుతోందని వస్తోన్న ఆరోపణలకు రుజువులు లేవు. నాణ్యతతో కూడిన వ్యాక్సిన్ను ప్రజలకు అందిస్తున్నాం. ఈ మేరకు టీకా నాణ్యతపై 20 లేబొరేటరీలలో 60 పరీక్షలు( క్వాలిటీ టెస్ట్లు) చేశారు’ అని ఆస్ట్రాజెనెకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అన్ టేలర్ చెప్పారు. వ్యాక్సిన్ క్వాలిటీ టెస్ట్ల వివరాలు సంబంధిత వెబ్సైట్లలో పొందుపరుస్తామని సంస్థ తెలిపింది. భారత్లో ఆస్ట్రాజెనెకా టీకాను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను విజయవంతంగా పంపిణీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం