Biological E: టీకాకు 90శాతం సమర్థత..?
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ ఇ (BE) తయారు చేస్తోన్న కార్బివాక్స్ (Corbevax) టీకా ప్రయోగాల్లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ అంచనా
దిల్లీ: కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో భారత్ అభివృద్ధి చేస్తోన్న టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్ టీకా మహమ్మారిని నిరోధించడంలో మెరుగైన పనితీరు కనబరుస్తుండగా, తాజాగా మరో దేశీయ టీకా కూడా అత్యంత ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ ఇ (BE) తయారు చేస్తోన్న కార్బివాక్స్ (Corbevax) టీకా ప్రయోగాల్లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘ఈమధ్యే విడుదలైన నొవావాక్స్ టీకా ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. భారత్లోనే ఏటా దాదాపు వంద కోట్ల డోసులు ఉత్పత్తి కానుండడంతో ఈ టీకాపై అంచనాలు పెరిగాయి. 90శాతం సామర్థ్యం కలిగిన టీకా చౌక ధరలోనే అందుబాటులోకి రానుంది. ఇదే సమయంలో భారత్లో మూడో దశకు సిద్ధమైన బయోలాజికల్ ఇ (బీఈ) వ్యాక్సిన్ కూడా ఇదేవిధమైన ఫలితాలు కనబరుస్తోంది’ అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో వినియోగించిన సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ టీకాలు అన్ని వయసులవారికీ సురక్షితమని తెలిపారు. అక్టోబర్ నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తుది ఫలితాలు ఇదే విధంగా ఉన్నట్లయితే మహమ్మారి పోరులో ఈ వ్యాక్సిన్లు గేమ్ ఛేంజర్గా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో వివిధ అభివృద్ధిలో దశల్లో ఉన్న కరోనా టీకాల వివరాలను ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్కే అరోరా వెల్లడించారు.
వీటితో పాటు భారత్లో మరో రెండు వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయని ఎన్కే అరోరా పేర్కొన్నారు. ముఖ్యంగా జైడస్ క్యాడిలాతో పాటు పుణెకు చెందిన జెన్నోవా ఫార్మా (ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో) తయారు చేసిన వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల్లో ఉన్నాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి ఇవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలా మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రపంచ దేశాలు భారత్పైనే ఆధారపడే పరిస్థితి వస్తుందని ఎన్కే అరోరా విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్బివాక్స్ (Corbevax) కరోనా వ్యాక్సిన్పై హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఈ) ప్రయోగాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాలకు సిద్ధంకాగా జులై నాటికి ఇవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM