షాపుల బయట గుమిగూడితే మేమేం చేస్తాం?
రాజధాని నగరంలోని మార్కెట్లలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించడంపై దిల్లీ వ్యాపారుల సంఘం స్పందించింది
దిల్లీ: రాజధాని నగరంలోని మార్కెట్లలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించడంపై దిల్లీ వ్యాపారుల సంఘం స్పందించింది. దుకాణాల బయట జనం గుమిగూడితే తామేం చేయగలమని కోర్టుకు తెలిపింది. మార్కెట్ పరిసరాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, దానికి వ్యాపారులేం చేయలేరని వివరించింది. దుకాణాల బయట ఉన్న వ్యక్తులను నియంత్రించడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సమాజ శ్రేయస్సు కోసం వ్యాపారులు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పేర్కొంది. లేదంటే కరోనా మూడోదశ వ్యాప్తి సంభవించే ప్రమాదముందని హెచ్చరించింది.
రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంపై చర్చించేందుకు అధికారులు, వ్యాపారులు సమావేశమవ్వాలని తెలిపింది. ఇటీవల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో దుకాణాలు, వ్యాపార సమూహాలు తెరచుకునేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దిల్లీ వ్యాపారుల సమాఖ్య ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. దుకాణాల్లో జనం గుమిగూడకుండా చూసే బాధ్యత ఆ యజమానికి ఉంటుంది కానీ, బయటి ప్రజలను ఆయనెలా నియంత్రించగలడని అన్నారు. మార్కెట్ పరిసరాల్లో జనాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులే తీసుకోవాలని అన్నారు. అధికారులకు వ్యాపారస్తులు కూడా సహకరిస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?