₹100 crore credited: కూలీ ఖాతాలో రూ.100 కోట్లు జమ
అతడో దినసరి కూలీ. అతడి బ్యాంకు ఖాతాలో రూ.17 మాత్రమే ఉండగా, అనూహ్యంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. అవి ఎలా వచ్చాయో అర్థం కాక తల పట్టుకుంటుంటే.. వాటికి లెక్క చెప్పాలంటూ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అతడు భయాందోళనలకు లోనవుతున్నాడు.
సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు
అతడో దినసరి కూలీ. అతడి బ్యాంకు ఖాతాలో రూ.17 మాత్రమే ఉండగా, అనూహ్యంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. అవి ఎలా వచ్చాయో అర్థం కాక తల పట్టుకుంటుంటే.. వాటికి లెక్క చెప్పాలంటూ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అతడు భయాందోళనలకు లోనవుతున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దేగంగాలోని వాసుదేవ్పుర్కు చెందిన మహ్మద్ నసీరుల్లా(26) వ్యవసాయ కూలీ. అతడికి ఎస్బీఐలో ఖాతా ఉంది. ఇటీవల అతడి ఖాతాలో ఒక్కసారిగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆయనకు జంగీపుర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నెల 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Accident: నేలలో కూరుకుపోయిన బోగీ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం?
-
India News
Odisha Train tragedy: ‘లగ్జరీ ట్రైన్స్కాదు.. కామన్ మ్యాన్ను పట్టించుకోండి’
-
India News
Odisha Train Tragedy: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి..
-
Movies News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. హృదయం ముక్కలైంది: సినీతారల ట్వీట్స్
-
General News
Top Ten News: ఒడిశా రైలు విషాదం.. టాప్ టెన్ కథనాలు
-
India News
Odisha Train Tragedy: రైలు ప్రమాదం.. సాంకేతిక లోపమా..?మానవ తప్పిదమా?