Dalai lama: రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా!

కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధమత గురువు దలైలామా తొలిసారి బహిరంగంగా కనిపించారు.......

Published : 19 Mar 2022 01:16 IST

ధర్మశాల: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధమత గురువు దలైలామా తొలిసారి బయటకు వచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్న ఆయన.. వైద్యుడితో బాక్సింగ్‌ కూడా చేయగలనంటూ చమత్కరించారు. ధర్మశాలలోని బౌద్ధ ఆలయంలో శుక్రవారం భక్తులకు తన బోధనలు వినిపించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన ఆరోగ్యం బాగున్నందున వెళ్లలేదన్నారు. తాను వైద్యుడితోనైనా బాక్సింగ్‌ చేసేంత బలంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది టిబెటిన్లతో పాటు సన్యాసులు, సెంట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీటీఏ) సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీటీఏ సభ్యుడు టెంజింగ్‌ జిగ్మే మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల తర్వాత దలైలామాను చూసిన ఈ రోజు తమకెంతో అందమైనదిగా పేర్కొన్నారు. ఆయన క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉండటం అదృష్టమన్న జిగ్మే.. దలైలామా దీర్ఘాయువు కోసం ప్రార్థించినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని