Crime News: కోమాలో ఉన్నాడని చెబుతూ.. ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం

ఏడాదిన్నర క్రితం మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టకుండా ఇంట్లోనే ఉంచుకుంది ఆయన కుటుంబం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. రావత్‌పుర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్‌(38) అహ్మదాబాద్‌లో ఆదాయపు పన్ను

Updated : 24 Sep 2022 06:49 IST

డాదిన్నర క్రితం మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టకుండా ఇంట్లోనే ఉంచుకుంది ఆయన కుటుంబం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. రావత్‌పుర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్‌(38) అహ్మదాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవారు. 2021 ఏప్రిల్‌ 22న మరణించారు. ఆయన కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. విమలేశ్‌ భార్య మిథాలీ పింఛను కోసం ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని