Tauktae: 61కి పెరిగిన మృతుల సంఖ్య
తౌక్టే తుపాను ధాటికి ఈ నెల 17న అరేబియా సముద్రంలో నౌక మునిగి పోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 61కి పెరిగింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న....
ముంబయి: తౌక్టే తుపాను ధాటికి ఈ నెల 17న అరేబియా సముద్రంలో నౌక మునిగి పోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 61కి పెరిగింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న నావికా, తీర రక్షణ దళాలు మరో 11 మృతదేహాలను కనుగొన్నాయి. ఇంకో 14 మంది జాడ తెలియాల్సి ఉంది. దొరికిన మృతదేహాల్లో 30 గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.
261 మందితో ప్రయాణిస్తున్న బార్జ్ పి-305 నౌక ఐదు రోజుల క్రితం నీట మునగగా.. ఇప్పటివరకూ 186 మందిని అధికారులు రక్షించారు. ఈ ప్రమాదంపై ముంబయి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. తుపాను సమీపిస్తున్న సమయంలో నౌక కెప్టెన్ రాకేశ్ పల్లవ్ తన యజమానిని సంప్రదించారని.. అయితే తుపాను ఎక్కువసేపు ఉండబోదనే సమాచారంతో దాన్ని తీరానికి తీసుకురాలేదని నౌక చీఫ్ ఇంజినీర్ రెహమాన్ హుస్సేన్ పోలీసులకు వివరించారు. సాధారణంగా విపత్కర సమయాల్లో అందుబాటులో ఉండే టక్ బోట్ ఐదు నాటికల్ మైళ్ల దూరం ఉంటుందని.. ప్రమాదం జరిగినప్పుడు అది 16 నాటికల్ మైళ్ల దూరంలో ఉండిపోవడం వల్ల సాయం అందలేదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ సాయం కోసం కెప్టెన్ విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. తుపాను హెచ్చరికలను పట్టించుకోకుండా కెప్టెన్ నిర్లక్ష్యం వహించారని రెహమాన్ పేర్కొన్నారు. దీంతో కెప్టెన్ రాకేశ్ పల్లవ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్