Agnipath: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : దేశయువతకు ఆర్మీ చీఫ్ పిలుపు
సాయుధ దళాల నియామకాల్లో భాగంగా కొత్తగా ప్రకటించిన ‘అగ్నిపథ్’ (Agnipath) పథకంలో గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం సైన్యంలో చేరాలనుకునే ఎంతోమంది యువకులకు గొప్ప అవకాశం కల్పిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.
వయోపరిమితి పెంపు గొప్ప అవకాశమన్న సైన్యాధిపతి
దిల్లీ: సాయుధ దళాల నియామకాల్లో భాగంగా కొత్తగా ప్రకటించిన ‘అగ్నిపథ్’ (Agnipath) పథకంలో గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం సైన్యంలో చేరాలనుకునే యువతకు గొప్ప అవకాశం కల్పిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. ఒకసారి మినహాయింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్మీకి చేరిందని.. దీంతో ఈ ఏడాదికి సంబంధించిన నియామక ప్రక్రియ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. అగ్నివీరులుగా (Agniveer) భారత సైన్యంలో చేరేందుకు ఉన్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు.
‘ఆర్మీ నియామకం- 2022 (Army Recruitment) ప్రవేశాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 23ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు చేరింది. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆర్మీ నియామకాలు నిలిచిపోవడంతో ఉద్యోగాలకు దూరమైన, దేశభక్తి కలిగిన యువతకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తాం. అగ్నివీరులుగా సైన్యంలో చేరేందుకుగాను దేశ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నాం’ అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.
ఇదిలాఉంటే, అగ్నిపథ్ పథకం కింద సాయుధ దళాల్లో కొత్త నియామకాలకు పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్లవరకు మాత్రమే అనుమతిస్తారు. అయితే, కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 2022లో చేపట్టే నియామకాలకు మాత్రం ఒకసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈసారి అభ్యర్థులను 23 ఏళ్లవరకు అనుమతించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్