అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం

దీపావళికి ముందే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఏటా సరయు నదీ తీరాన దీపావళికి ఒక్కరోజు ముందు నిర్వహించే ‘దీపోత్సవ్’

Updated : 13 Nov 2020 20:31 IST

అయోధ్య: దీపావళికి ముందే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఏటా సరయు నదీ తీరాన దీపావళికి ఒక్కరోజు ముందు నిర్వహించే ‘దీపోత్సవ్’ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం కన్నులపండువగా నిర్వహించారు. 5 లక్షల 51వేల దీపాలను వెలిగించారు. దీంతో అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ పాల్గొన్నారు. రామ్‌మనోహర్‌ లోహియా విశ్వవిద్యాలయం, అయోధ్యలోని వివిధ కళాశాలకు చెందిన వేల మంది విద్యార్థులు ఈ దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు లేజర్‌ షోలు సైతం ఆకట్టుకుంటున్నాయి.

గతేడాది సరయు నదీ తీరాన 4 లక్షల 10 వేల మట్టి దివ్వెలను వెలిగించి యూపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. ఈ సారి ఆ రికార్డును తిరగరాసేందుకు 5.51 లక్షల దీపాలను వెలిగించాలని నిర్ణయించారు. అందులోనూ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తొలి ఏడాది కావడంతో ఈ కార్యక్రమ నిర్వహణను యోగి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన  భాజపా.. అప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని