గణతంత్ర వేడుకలకు మొబైల్ యాప్
కరోనా వేడుకల కారణంగా గణతంత్ర వేడుకలపై ఈసారి ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది. పరేడ్లో విన్యాసాల్లో పాల్గొనే సిబ్బంది కుదింపుతో పాటు వీక్షకుల సంఖ్యను కూడా తగ్గించింది.
దిల్లీ: కరోనా కారణంగా గణతంత్ర వేడుకలపై ఈసారి ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది. కవాతు విన్యాసాల్లో పాల్గొనే సిబ్బంది కుదింపుతో పాటు వీక్షకుల సంఖ్యను కూడా తగ్గించింది. అయితే, రిపబ్లిక్ డే వేడుకలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనివారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మొబైల్యాప్ విడుదల చేసింది.
‘రిపబ్లిక్ డే పరేడ్ 2021’ లేదా ‘ఆర్డీపీ 2021’ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ను కేంద్ర రక్షణ శాఖ సోమవారం విడుదల చేసింది. దీని ద్వారా పరేడ్ విన్యాసాలు, శకటాల ప్రదర్శన, ఇతర వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్ ప్లేస్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
గణతంత్ర వేడుకల కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. సాధారణంగా ఏటా ఈ ఉత్సవాలు ఎర్రకోటలో జరుగుతాయి. అయితే, కరోనా దృష్ట్యా ఈసారి పరేడ్ దూరాన్ని తగ్గించారు. అంతేగాక, పదేళ్లలోపు చిన్నారులను కూడా అనుమతించట్లేదు. మరోవైపు ఈ వేడుకల్లో తొలిసారి రఫేల్ యుద్ధవిమానం సందడి చేయనుంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా