AIIMS: సర్వర్పై సైబర్ దాడికి యత్నించారని ఎయిమ్స్ ట్వీట్.. అదేం లేదంటూ కేంద్రమంత్రి క్లారిటీ!
దిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) సర్వర్లపై హ్యాకర్లు మరోసారి సైబర్ దాడికి యత్నించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే, ఎలాంటి సైబర్ దాడి జరగలేదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekha) ప్రకటించారు.
దిల్లీ: దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి (AIIMS Delhi) సర్వర్లపై హ్యాకర్లు (Hackers) మరోసారి సైబర్ దాడి (Cyber Attack)కి విఫలయత్నం చేసినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే, వారి ప్రయత్నాలు సఫలం కాలేదని ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు ట్విటర్లో వెల్లడించాయి. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekha) భిన్న ప్రకటన చేశారు. ఎయిమ్స్ సర్వర్లపై ఎవరూ సైబర్దాడికి యత్నించలేదని స్పష్టంచేశారు. ఈ-హాస్పటల్ (E-Hospital) సేవల్లోని సమాచారం లక్ష్యంగా ఈ సైబర్ దాడి జరిగినట్లు తొలుత ఎయిమ్స్ తన అధికారిక ట్విటర్లో ట్వీట్ చేసింది. అయితే, సైబర్ దాడే జరగలేదని.. కేంద్ర మంత్రి మరో ట్వీట్ చేయడం గమనార్హం.
‘‘ఈరోజు మధ్యాహ్నం 2:50గంటల సమయంలో దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ఈ-హాస్పటల్ డేటా లక్ష్యంగా సర్వర్లలోకి ఓ మాల్వేర్ను ప్రవేశపెట్టేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ గుర్తించాయి. అయితే, వారి ప్రయత్నాలను సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఈ-హాస్పటల్ సేవల భద్రతలో ఎలాంటి లోపం లేదు. ఎప్పటిలాగే ఈ సేవలు పనిచేస్తున్నాయి’’ అని ఎయిమ్స్ ట్వీట్లో పేర్కొంది.
‘‘ఈ-హాస్పటల్ సేవలు పూర్తిగా ఎయిమ్స్ సిబ్బంది మాత్రమే ఉపయోగించే అంతర్గత అప్లికేషన్. అది, సాధారణ ఇంటర్నెట్ యూజర్లకు అందుబాటులో ఉండదు. ఒకవేళ ఎవరైనా ఈ అప్లికేషన్ను అనుమతి లేకుండా ఉపయోగించాలని ప్రయత్నిస్తే.. ఎయిమ్స్లోని సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. అలా, ఎవరైనా బయటి వ్యక్తులు ఈ-హాస్పటల్ అప్లికేషన్ను ఉపయోగించేందుకు ప్రయత్నించినప్పుడు వైరస్ అంటూ వచ్చిన ఎర్రర్ మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసి సైబర్ దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి, ఎలాంటి సైబర్ దాడి ఘటనలు చోటు చేసుకోలేదు. వైరస్ అంటూ వచ్చే ఎర్రర్ మెసేజ్ సమస్యను కూడా పరిష్కరించారు’’ అని మంత్రి తన ట్వీట్లో వివరించారు.
గతేడాది నవంబరులో దిల్లీ ఎయిమ్స్లోని సర్వర్లపై సైబర్ దాడి జరిగింది. చైనా, హాంకాంగ్లలోని రెండు ప్రాంతాల నుంచి హాక్యర్లు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 100 సర్వర్లలో ఐదు సర్వర్లపై దాడి చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వీటిలోని లక్షల మంది రోగుల డేటాను విజయవంతంగా తిరిగి పొందినట్లు పేర్కొన్నాయి. దీనిపై ఎయిమ్స్ కూడా అప్పట్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్