Delhi: కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిన్నారులు

దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సబ్జీ మండీ ప్రాంతాంలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడగా..

Published : 13 Sep 2021 15:51 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సబ్జీ మండీ ప్రాంతాంలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అంతేగాక, భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఇద్దరు చిన్నారులపై కూడా శిథిలాలు పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని