దిల్లీ పాజిటివ్: 36శాతం నుంచి 6శాతానికి!
కరోనా ఉద్ధృతికి అల్లాడిపోయిన దేశ రాజధానిలో మహమ్మారి వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో 36శాతానికి పెరిగిన కొవిడ్ పాజిటివిటీ రేటు తాజాగా 5.7శాతానికి తగ్గింది.
మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధం - దిల్లీ సీఎం
దిల్లీ: కరోనా ఉద్ధృతికి అల్లాడిపోయిన దేశ రాజధానిలో మహమ్మారి వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో 36శాతానికి పెరిగిన కొవిడ్ పాజిటివిటీ రేటు తాజాగా 5.7శాతానికి తగ్గింది. గడిచిన 24గంటల్లో అక్కడ 3800పాజిటివ్ కేసులు నమోదయినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 5 తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం, పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువగా ఉంటే కొవిడ్ ఆంక్షలను సడలించుకోవచ్చు.
దేశంలో రెండు నెలల క్రితం మహారాష్ట్ర తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు దిల్లీలో నమోదైన విషయం తెలిసిందే. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 30వేలు దాటింది. దీంతో వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ ఆంక్షలు అమలుచేయడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 14లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రస్తుతం 45వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.
మూడో ముప్పుపై అప్రమత్తం..
ప్రస్తుతం వైరస్ తీవ్రత కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ మూడు ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో ముప్పు బారినపడకుండా చిన్నారులను రక్షించుకునేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గతంలో కంటే మెరుగుగా వైద్య పడకలు, ఆక్సిజన్, ఔషధాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
పెరుగుతున్న ఖాళీ పడకలు..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దిల్లీ నగరం, ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముఖ్యంగా ఐసీయూ పడకలు, ఆక్సిజన్ కొరతతో కొవిడ్ బాధితులు అల్లాడిపోయారు. న్యాయస్థానాల ఆదేశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతో తాజాగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం, ఆసుపత్రుల నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో పలు కొవిడ్ ఆసుపత్రులు ఖాళీ అవుతున్నాయి. దిల్లీ ప్రభుత్వ ప్రత్యేక యాప్ ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 27వేల పడకలు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం వాటిలో 13వేల పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 11వేల ఆక్సిజన్ పడకలు కాగా మరో 1200లకు పైగా ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి.
మరణాలు కాస్త తగ్గుముఖం..
కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ కొవిడ్ మరణాలు మాత్రం దిల్లీని వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం నిత్యం 400లకు పైగా నమోదైన కొవిడ్ మరణాలు ప్రస్తుతం 200లకు తగ్గాయి. నిన్న ఒక్కరోజే 235 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్ మృతుల సంఖ్య 22వేలు దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్యను ఆర్జీడీ కంచుకోట అయిన సరన్ నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. -
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. -
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
Chennai Super Kings: ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఎన్నికల బాండ్ల రూపంలో అన్నాడీఎంకేకు భారీగా విరాళం ఇచ్చినట్లు తెలిసింది. -
Sadananda: కాంగ్రెస్లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం
తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని భాజపా సీనియర్ నేత సదానంద గౌడ(Sadananda) అన్నారు. -
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారం కోసం మార్చి 19న తిహాడ్ జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. -
సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్ ‘4 టిప్స్’.. రోజుకు 600 లీటర్లు సేవ్ చేశారట..!
Bengaluru Water Crisis: బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ కొన్ని టిప్స్తో రోజుకు 600 లీటర్లు నీటిని ఆదా చేశారట. వాటిని ఆమె వివరించగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ టిప్స్ ఏంటో మీరే చూడండి..! -
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. -
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. -
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు