Delhi: కొత్త విధానం వచ్చే వరకు పాత విధానమే.. దిల్లీలో మద్యం పాలసీ మరో ఆరు నెలలు పొడిగింపు
సెప్టెంబరు 30తో పాత మద్యం పాలసీ (Liquor Policy) ముగియనుండటంతో దిల్లీ ప్రభుత్వం దానిని మరో ఆరు నెలలు పొడిగించింది.
దిల్లీ : దిల్లీ (Delhi) ప్రభుత్వం మద్యం పాలసీ (Liquor Policy)ను మరోసారి పొడిగించింది. గతేడాది దిల్లీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ విధానాన్ని (Excise Policy) రద్దు చేసి పాత మద్యం పాలసీ విధానాన్ని తిరిగి అమలులోకి తెచ్చింది. ఈ పాలసీ మార్చి 31, 2023 తో ముగియడంతో దిల్లీ ప్రభుత్వం దానిని సెప్టెంబరు 30 తో వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది కూడా గడువు ముగియనుండటంతో మరో ఆరు నెలలు పొడిగించింది.
దిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రూపొందించి అమలు చేసేవరకు పాత పాలసీనే కొనసాగనుంది. ఇందుకు త్వరగా కొత్త మద్యం పాలసీని రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాక, ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏజెన్సీలు మాత్రమే మద్యం దుకాణాలను నిర్వహిస్తారు.
ఆగస్టులో మద్యం దుకాణాలను, రెస్టారెంట్లను, క్లబ్లు, హోటళ్లను నడుపుతున్న యజమానులు, కంపెనీ భాగస్వాములు అనుమతి పత్రాలను ఎక్సైజ్ శాఖ కు అందించడం తప్పనిసరి చేసింది. దీనివల్ల లైసెన్స్ ఉన్న వ్యక్తులు, నేర చరిత్ర లేని వారు మాత్రమే మద్యం దుకాణాలను నడిపే అవకాశం ఉంటుంది. నగరంలో ఇప్పటివరకు 970 మందికి పైగా హెచ్సీఆర్ (HCR category) కేటగిరీ లైసెన్స్ దారులు ఉన్నారు. 400 మంది లైసెన్స్ వెరిఫికేషన్ కోసం పోలీసులను ఆశ్రయించినట్లు బార్ల యజమానులు మీడియాకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ సీఎం, గవర్నర్ మధ్య మరోసారి మాటల యుద్ధం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. -
అర్జున్ ముండాకు వ్యవసాయశాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర మంత్రి పదవులకు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్సింగ్ పటేల్, రేణుకాసింగ్ సమర్పించిన రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదించారు. -
సత్పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల సత్పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. -
చైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు భారత్లో లేవు : కేంద్రం
ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా ఆర్నెల్ల కాలంలో దిల్లీలోని ఎయిమ్స్లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఖతార్లో మరణశిక్ష పడిన బాధితులతో భారత రాయబారి భేటీ
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్లోని భారత రాయబారి కలిశారు. -
మెఫ్తాల్ వినియోగంతో దుష్ప్రభావాల ముప్పు!
కీళ్లవాతం, నెలసరి నొప్పిని తప్పించుకునేందుకు ప్రజలు అధికంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధం కొన్ని దుష్ప్రభావాలకూ కారణమయ్యే ముప్పు లేకపోలేదని భారత ఔషధప్రబంధ కమిషన్ (ఐపీసీ) హెచ్చరించింది! -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. -
Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..
గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ గుజరాత్లో గ్రీన్ ఎనర్జీ పార్క్ నిర్మిస్తోంది. ఇది అంతరిక్షం నుంచి చూసిన కనిపిస్తుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
-
బీబీసీ ఛైర్మన్గా సమీర్ షా
-
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య