పట్టాలెక్కుతున్న కొవిడ్ ఐసోలేషన్ కోచ్లు..!
కరోనా ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో రైల్వేశాఖ కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మరోసారి సిద్ధం చేస్తోంది. అవసరమైన రాష్ట్రాల్లో ఈ బోగీలను ఉంచేందుకు ఇప్పటివరకు 4వేల కోచ్లను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
4వేల కోచ్లు సిద్ధం చేసిన రైల్వేశాఖ
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొవిడ్ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మరోసారి సిద్ధం చేస్తోంది. అవసరమైన రాష్ట్రాల్లో రైల్వే ఐసోలేషన్ బోగీలను ఉంచేందుకు ఇప్పటివరకు 4వేల కోచ్లను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు గతేడాది రైల్వేశాఖ తయారు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మరోసారి సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిలో కొన్నింటిని మహారాష్ట్రలో అందుబాటులో ఉంచామని రైల్వేశాఖ ప్రకటించింది. ‘కరోనా పోరులో భాగంగా రైల్వేశాఖ తన వనరులను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కొవిడ్ ఐసోలేషన్ కోచ్లను మహారాష్ట్రలోని నందూర్బార్లో అందుబాటులో ఉంచాము. అక్కడ కరోనా రోగులకు సేవలు ప్రారంభమయ్యాయి’ అని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం నందూర్బార్లో 94 కొవిడ్ ఐసోలేషన్ కోచ్లు ఏర్పాటు చేయగా.. వీటిలో ప్రస్తుతం ఆరుగురు రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి.. ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరగడం, కొవిడ్ పడకలు అందుబాటులో లేని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు రైల్వే ఐసోలేషన్ కోచ్లను కేటాయిస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
మాకూ ఐసోలేషన్ కోచ్లు ఇవ్వండి..
దేశ రాజధానిలో కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న వేళ.. ప్రత్యేక రైల్వే ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేయాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతోన్న సందర్భంగా దాదాపు 5వేల పడకల సామర్థ్యం కలిగిన ఐసోలైషన్ బోగీలను దిల్లీలో అందుబాటులో ఉంచాలని దిల్లీ సీఎస్ విజయ్ కుమార్ రైల్వే బోర్డు ఛైర్మన్కు లేఖ రాశారు. ఇప్పటికే నగరంలోని ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా వీటిని అందుబాటులో ఉంచాలని కోరారు.
ఇదిలాఉంటే, దేశంలో గతేడాది కరోనా వైరస్ తొలిదఫా విజృంభణ సమయంలో రైల్వే శాఖ ప్రత్యేక ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాల్లో 813 కోచ్ల ద్వారా దాదాపు 12వేలకు పైగా పడకలను అందుబాటులో ఉంచింది. దిల్లీకి 503 కోచ్లు, ఉత్తర్ ప్రదేశ్లో 270 కోచ్లు, బిహార్లో 40కోచ్లతో పాటు పలు రాష్ట్రాలకు అవసరమైన ఐసోలేషన్ కోచ్లను రైల్వేశాఖ అందుబాటులో ఉంచింది. అయితే, వాటిలో ఎక్కువగా వినియోగించలేదని సమాచారం. తాజాగా మరోసారి కొవిడ్ ఉద్ధృతి పెరగడంతో మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు ఐసోలేషన్ బోగీలు కావాలని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వీటిలో స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ రోగులను ఐసోలేషన్లో ఉంచడంతోపాటు మరికొన్ని బోగీల్లో ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ కలిసి సంయుక్తంగా చేపడుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్